సనాతన్ గా మారిన సాయికుమార్ తనయుడు
చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్ లో […]
చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్ లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్ తో రావడం చూపించారు. క్రైమ్ జరిగిన ప్రాంతంలో తుపాకీ, కత్తి, కళ్లద్దాలు, ఫింగర్ ప్రింట్స్, బాడీ పడిఉన్న డ్రాయింగ్..ఇలా ఆధారాలు ఉన్నాయి. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.
చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలీ రెజా, నందినీ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రీసెంట్ గా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు ఆది సాయికుమార్. అతిథి దేవోభవ, బ్లాక్, కిరాతక లాంటి సినిమాలన్నీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే. దానికి కొనసాగింపుగా వస్తోంది సనాతన్ సినిమా.