సినిమానే ఫస్ట్ అంటున్న హీరోయిన్
తనకు ఓటీటీ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. అయినప్పటికీ తన ప్రాధాన్యం సినిమాకే ఇస్తానంటోంది. హీరో సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తనకు హీరోతో సంబంధం లేదని, క్యారెక్టర్ కే ప్రాధాన్యం ఇస్తానంటోంది. “సినిమా సినిమాకూ చాలా నేర్చుకుంటున్నా. ఎందుకంటే డిఫరెంట్ దర్శకుల ఆలోచనలు, ఏదో ఒకటి నేర్చుకునేలా ఉంటోంది. ఓటీటీలలో వినూత్నమైన కథలు వస్తున్నాయి. వాటిని చాలా చూశాను. నాకు ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ […]
తనకు ఓటీటీ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. అయినప్పటికీ తన ప్రాధాన్యం సినిమాకే ఇస్తానంటోంది. హీరో సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. తనకు హీరోతో సంబంధం లేదని, క్యారెక్టర్ కే ప్రాధాన్యం ఇస్తానంటోంది.
“సినిమా సినిమాకూ చాలా నేర్చుకుంటున్నా. ఎందుకంటే డిఫరెంట్ దర్శకుల ఆలోచనలు, ఏదో ఒకటి నేర్చుకునేలా ఉంటోంది. ఓటీటీలలో వినూత్నమైన కథలు వస్తున్నాయి. వాటిని చాలా చూశాను. నాకు ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ వెండితెరకే ముందు ప్రాధాన్యత ఇస్తా. నెట్ఫ్లిక్స్లో ట్రూ స్టోరీస్.. సీరిస్ నాకు బాగా నచ్చింది.”
తనకు ఆఫర్లు రావడానికి సోషల్ మీడియానే కారణం అంటోంది నిధి అగర్వాల్. తనను సోషల్ మీడియానే హీరోయిన్ ను చేసిందని, అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటానంటోంది.
“నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా వుంటాను. నటి కాకముందే నాకు ఒక మిలియన్ ఫాలోవర్స్ వున్నారు. సోషల్ మీడియా వల్ల నా ఫొటోలు చూసి నేను పలానా పాత్రకు సరిపోతానని కొందరు దర్శకులు పిలుస్తుంటారు. ఇది నాకు చాలా ఉపయోగపడింది. ఇక పలువురు విమర్శలు కూడా ఘాటుగానే వుంటాయి. కాస్త ఇబ్బంది పెట్టినా వాటిని పట్టించుకోను.”
ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తోంది నిధి అగర్వాల్. తన కెరీర్ లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అంటోంది. సినిమాలో తను ఫైట్స్ కూడా చేశానంటోంది.