Telugu Global
NEWS

వేలంలో అంద‌రూ పాల్గొన‌వ‌చ్చు " సుప్రీం కోర్టు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్ధ దేవ‌స్థానాల్లో ఒక‌టైన శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయ దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులూ పాల్గొనవచ్చని భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. వేలంలో హిందువులు త‌ప్ప వేరేవారు ఎవ‌రూ పాల్గొన‌వ‌ద్ద‌ని 2015లో గ‌త‌ టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవోను స‌వాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. 2019లో ఏపీ హైకోర్టు జీఓను స‌మ‌ర్థిస్తూ తీర్పునిచ్చింది. ఏపీ హైకోర్టు తీర్పుపై సంతృప్తి చెంద‌ని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది జనవరిలో […]

వేలంలో అంద‌రూ పాల్గొన‌వ‌చ్చు  సుప్రీం కోర్టు
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్ధ దేవ‌స్థానాల్లో ఒక‌టైన శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయ దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులూ పాల్గొనవచ్చని భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. వేలంలో హిందువులు త‌ప్ప వేరేవారు ఎవ‌రూ పాల్గొన‌వ‌ద్ద‌ని 2015లో గ‌త‌ టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవోను స‌వాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. 2019లో ఏపీ హైకోర్టు జీఓను స‌మ‌ర్థిస్తూ తీర్పునిచ్చింది.

ఏపీ హైకోర్టు తీర్పుపై సంతృప్తి చెంద‌ని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది జనవరిలో స్టే ఇచ్చింది. సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదంటూ జానీబాషా, టీఎం రబ్బానీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ , జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేప‌ట్టింది. మతం, విశ్వాసం ప్రాతిపదికన ఆలయ దుకాణాల వేలంలో హిందూయేతరులు పాల్గొనడాన్ని నిరాకరించడం సబబుకాదని పేర్కొంది.

ఆలయ ప్రాంగణాల్లో మత విశ్వాసాలకు విఘాతం కలిగించే మద్యం, గ్యాంబ్లింగ్‌ వంటివి అనుమతించరాదుగానీ పూలు, పళ్లు, చిన్నపిల్లల ఆటబొమ్మలకు సంబంధించిన దుకాణాల వేలంలో హిందూయేతరులను అనుమతించకపోవడం సరికాదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. శ్రీశైలం మలికార్జునస్వామి ఆలయ దుకాణాలు, దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులనూ అనుమతించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

First Published:  18 Dec 2021 9:23 AM GMT
Next Story