ఓటీటీలోకి మరో చిన్న సినిమా
ఓవైపు థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీ సంస్థలు మాత్రం తమ ప్రయత్నాల్ని ఆపలేదు. చిన్నాచితకా సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మరో చిన్న సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. దీని పేరు డబ్ల్యూ-డబ్ల్యూ-డబ్ల్యూ. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా.రవిప్రసాద్ రాజు నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా […]
ఓవైపు థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీ సంస్థలు మాత్రం తమ ప్రయత్నాల్ని ఆపలేదు. చిన్నాచితకా సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మరో చిన్న సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. దీని పేరు డబ్ల్యూ-డబ్ల్యూ-డబ్ల్యూ.
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా.రవిప్రసాద్ రాజు నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదలకానుంది. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' డిజిటల్ రైట్స్ని 'సోని లివ్' సంస్థ దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం సోనిలివ్లో ప్రసారం కానుంది.