అప్పుడు మాటిచ్చారు.. ఇప్పుడు నిలబెట్టుకున్నారు
పలాస సినిమా రిలీజ్ కు ముందే గీతాఆర్ట్స్ నుంచి ఆ దర్శకుడు కరుణకుమార్ కు హామీ లభించింది. తమ బ్యానర్ పై కరుణ్ కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తామని అల్లు అరవింద్ అప్పట్లోనే ప్రకటించారు. అప్పుడు అలా మాటిచ్చిన అల్లు అరవింద్, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. కరుణ కుమార్ తో సినిమా ఎనౌన్స్ చేశారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూతన చిత్రం […]
పలాస సినిమా రిలీజ్ కు ముందే గీతాఆర్ట్స్ నుంచి ఆ దర్శకుడు కరుణకుమార్ కు హామీ లభించింది. తమ బ్యానర్ పై కరుణ్ కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తామని అల్లు అరవింద్ అప్పట్లోనే ప్రకటించారు. అప్పుడు అలా మాటిచ్చిన అల్లు అరవింద్, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. కరుణ కుమార్ తో సినిమా ఎనౌన్స్ చేశారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి
నిర్మాతలుగా నూతన చిత్రం ప్రారంభమైంది. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల దర్శకుడు కరణ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంజలి, రావు రమేశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలతో ఈ సినిమా రాబోతోంది.
మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా
కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు
అరవింద్ గారు కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. నిజానికి ఇది స్ట్రయిట్ మూవీ కాదు. మలయాళ సినిమాకు రీమేక్. ప్రస్తుతానికి మేకర్స్ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు.