Telugu Global
Cinema & Entertainment

మహాసముద్రం మళ్లీ ముందుకొచ్చింది

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 23న మహాసముద్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ లుక్ […]

మహాసముద్రం మళ్లీ ముందుకొచ్చింది
X

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో
రాబోతున్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని
తెర‌కెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 23న మహాసముద్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్టు పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది.

దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సంగీత
దర్శకుడు చేతన్ భరద్వాజ్ అందించిన రెండు పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇంటెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

First Published:  20 Sep 2021 7:09 AM GMT
Next Story