Telugu Global
Cinema & Entertainment

ఆరేళ్ల తర్వాత మరోసారి కలిశారు

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వినూత్న కాన్సెప్ట్‌లతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్‌తో క‌లిసి సందీప్ కిషన్ మ‌రో ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టైగర్ అనే సినిమా వచ్చిన ఆరేళ్ల తర్వాత సందీప్, వీఐ ఆనంద్ కలిసి చేస్తున్న ప్రాజెక్టు ఇది. హాస్య మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో […]

ఆరేళ్ల తర్వాత మరోసారి కలిశారు
X

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వినూత్న కాన్సెప్ట్‌లతో చిత్రాలను
తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్‌తో క‌లిసి సందీప్ కిషన్ మ‌రో ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టైగర్ అనే సినిమా వచ్చిన ఆరేళ్ల తర్వాత సందీప్, వీఐ ఆనంద్ కలిసి చేస్తున్న ప్రాజెక్టు ఇది.

హాస్య మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు పూజా
కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి అల్లరి నరేష్ క్లాప్ కొట్టారు. నాగ శౌర్య కెమెరా
స్విచ్చాన్ చేశారు. జెమినీ కిరణ్, నిర్మాత సుధీర్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. నాంది మూవీ డైరెక్టర్
విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు.

కన్నడ సూపర్ హిట్ మూవీ దియా ఫేమ్ ఖుషీ రవి, ఏక్ మినీ కథ ఫేమ్ కావ్యా థాపర్‌లు ఈ చిత్రంలో
హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కెమెరామెన్‌గా సిద్, ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

First Published:  19 Sep 2021 8:20 AM GMT
Next Story