Telugu Global
NEWS

టెన్త్​ పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది..

తెలంగాణలో ఎట్టకేలకు బడులు తెరుచుకున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పాఠశాలలు తెరవకపోవడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఆన్​లైన్​ క్లాసులు మాత్రమే ఉంటున్నాయి. తమ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారోనని తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు కొంత మేర ఆన్​లైన్ క్లాసులు వింటున్నప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పల్లెటూరు విద్యార్థులు మాత్రం గత రెండేళ్లుగా చదువుకు దూరమయ్యారని చెప్పక తప్పదు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. ఆయా రాష్ట్రాల్లో మళ్లీ బడులు తిరిగి […]

టెన్త్​ పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది..
X

తెలంగాణలో ఎట్టకేలకు బడులు తెరుచుకున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పాఠశాలలు తెరవకపోవడంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఆన్​లైన్​ క్లాసులు మాత్రమే ఉంటున్నాయి. తమ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారోనని తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు కొంత మేర ఆన్​లైన్ క్లాసులు వింటున్నప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పల్లెటూరు విద్యార్థులు మాత్రం గత రెండేళ్లుగా చదువుకు దూరమయ్యారని చెప్పక తప్పదు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. ఆయా రాష్ట్రాల్లో మళ్లీ బడులు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 వతేదీ నుంచి తెలంగాణలోనూ స్కూళ్లు మొదలైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సర్కారు పదో తరగతి షెడ్యూల్​ను ప్రకటించింది. మార్చి లేదా ఏప్రిల్​ నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేశారు.

ఈ ఏడాది 213 రోజులు పాఠశాల పనిదినాలుగా ప్రకటించారు. 47 రోజులు ఆన్​లైన్​లో, 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్​ 23న పాఠశాల చివరి వర్కింగ్​ రోజు అని స్పష్టం చేశారు. ‘ఫిబ్రవరి 25 లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు. అంతే కాకుండా అక్టోబర్ 6 నుంచి 17 వరకు 12 రోజుల పాటు దసరా సెలవులు, జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వబోతున్నాం’ అని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు.

పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం షెడ్యూల్​ ప్రకటించింది..కానీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో కరోనా కేసులు భయపెడుతుండగా, మరోవైపు కరోనా థర్డ్​వేవ్​ వచ్చేస్తుందంటూ కొందరు హెచ్చరిస్తుండటంతో వారు కలవరం చెందుతున్నారు.

First Published:  4 Sep 2021 11:04 PM GMT
Next Story