వాళ్లిద్దరూ మరోసారి కలిశారు
సక్సెస్ ఫుల్ కాంబినేషన్లు మళ్లీ మళ్లీ కలుస్తాయి. మహేష్-పూజాహెగ్డే మరో సినిమా చేస్తున్నారంటే ఆ కిక్కే వేరు. అసలు ఎలాంటి సక్సెస్ లేకుండానే కాంబినేషన్లు కలిస్తే ఎలా ఉంటుంది. ఆదిసాయికుమార్, పాయల్ రాజ్ పుత్ కాంబో ఇలాంటిదే. వీళ్లిద్దరూ కలిసి ప్రస్తుతం వీరభద్రమ్ దర్శకత్వంలో కిరాతక అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అంతలోనే పాయల్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు ఆది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమా స్టార్ట్ అయింది. ఆది కథానాయకుడిగా […]
సక్సెస్ ఫుల్ కాంబినేషన్లు మళ్లీ మళ్లీ కలుస్తాయి. మహేష్-పూజాహెగ్డే మరో సినిమా చేస్తున్నారంటే ఆ కిక్కే
వేరు. అసలు ఎలాంటి సక్సెస్ లేకుండానే కాంబినేషన్లు కలిస్తే ఎలా ఉంటుంది. ఆదిసాయికుమార్, పాయల్ రాజ్ పుత్ కాంబో ఇలాంటిదే.
వీళ్లిద్దరూ కలిసి ప్రస్తుతం వీరభద్రమ్ దర్శకత్వంలో కిరాతక అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఇంకా
రిలీజ్ అవ్వలేదు. అంతలోనే పాయల్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు ఆది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమా స్టార్ట్ అయింది.
ఆది కథానాయకుడిగా నాటకం ఫేమ్ కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. విజన్
సినిమా బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా మరోసారి పాయల్ కు ఛాన్స్ ఇచ్చాడు ఆది.
కిరాతక సినిమా హిట్టయితే ఈ ప్రాజెక్టుకు కచ్చితంగా క్రేజ్ వస్తుంది. ప్రస్తుతానికి దీనికి టీఎంకే అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. రెగ్యులర్ షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలైంది.