Telugu Global
NEWS

కౌశిక్​కు ఎమ్మెల్సీ.. అసలు కేసీఆర్​ వ్యూహమేంటి?

ఇటీవల కాంగ్రెస్​ పార్టీ నుంచి టీఆర్​ఎస్​లో చేరిన పాడి కౌశిక్​ రెడ్డికి గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. కౌశిక్​ రెడ్డి హుజూరాబాద్​ నియోజకవర్గంలో కీలక నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో .. అక్కడి టీఆర్​ఎస్​ అభ్యర్థి ఈటల రాజేందర్​కు గట్టి పోటీఇచ్చారు. అయితే ఇటీవల కౌశిక్​రెడ్డి.. టీఆర్​ఎస్​లో చేరడంతో ఆయనకు టికెట్​ దక్కుతుందని అంతా భావించారు. కానీ టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ వ్యూహాత్మకంగానే కౌశిక్​రెడ్డిని పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది. ఈటల రాజేందర్​ మీద అవినీతి […]

కౌశిక్​కు ఎమ్మెల్సీ.. అసలు కేసీఆర్​ వ్యూహమేంటి?
X

ఇటీవల కాంగ్రెస్​ పార్టీ నుంచి టీఆర్​ఎస్​లో చేరిన పాడి కౌశిక్​ రెడ్డికి గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. కౌశిక్​ రెడ్డి హుజూరాబాద్​ నియోజకవర్గంలో కీలక నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో .. అక్కడి టీఆర్​ఎస్​ అభ్యర్థి ఈటల రాజేందర్​కు గట్టి పోటీఇచ్చారు. అయితే ఇటీవల కౌశిక్​రెడ్డి.. టీఆర్​ఎస్​లో చేరడంతో ఆయనకు టికెట్​ దక్కుతుందని అంతా భావించారు. కానీ టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ వ్యూహాత్మకంగానే కౌశిక్​రెడ్డిని పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది.

ఈటల రాజేందర్​ మీద అవినీతి ఆరోపణలు రావడం.. ఆయనను మంత్రి పదవి నుంచి బయటకు పంపించడంతో.. తెలంగాణ సమాజం నుంచి సానుభూతి దక్కింది. అన్ని పార్టీల వారు తొలుత ఈటలకు అండగా నిలబడ్డారు. సీఎం కేసీఆర్​ ఉద్దేశ్య పూర్వకంగానే.. ఈటలను పక్కకు పెట్టారన్న వాదన బలంగా తెరమీదకు వచ్చింది. ఓ వైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు బాహాటంగానే ఈటలకు మద్దతు తెలిపారు.

కానీ అదే టైంలో .. హుజూరాబాద్​ నియోజకవర్గ కాంగ్రెస్​ నేత పాడి కౌశిక్​రెడ్డి.. ఈటలపై విమర్శలకు దిగారు. ఆయన అవినీతి పరుడే అంటూ స్టేట్​మెంట్లు ఇచ్చారు. ఓ దశలో టీఆర్​ఎస్​ నేతల కంటే ఎక్కువ కౌశిక్​రెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతో కౌశిక్​రెడ్డి టీఆర్​ఎస్​లో చేరబోతున్నాడన్న అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన మాత్రం వాటిని ఖండిస్తూ వచ్చారు. ఇక రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక కూడా కౌశిక్​రెడ్డి కాంగ్రెస్​లో యాక్టివ్​గానే ఉన్నారు. కానీ అంతలోనే ఆయన టీఆర్ఎస్​లో చేరారు.

కౌశిక్​ రెడ్డి.. టీఆర్​ఎస్​లో చేరబోయేముందు కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు టీఆర్​ఎస్​ టికెట్​ ఖాయమైందంటూ కౌశిక్​ మాట్లాడిన ఓ ఫోన్​ కాల్​ ఆడియో బయటకొచ్చింది. కాంగ్రెస్​ పార్టీ ఆయన మీద చర్యలు తీసుకొనే లోపే కౌశిక్​ టీఆర్​ఎస్​లో చేరబోతున్నట్టు ప్రకటించారు. దీంతో కౌశిక్​కు హుజూరాబాద్​ టీఆర్​ఎస్​ టికెట్​ ఖాయమైందని అంతా భావించారు.

కౌశిక్​రెడ్డి కూడా తెలంగాణ భవన్​లో సీఎం కేసీఆర్​ సమక్షంలో టీఆర్​ఎస్​లో చేరారు. కానీ ఆయనకు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక్కడ టీఆర్​ఎస్​ నుంచి ఎన్​ఆర్​ఐ బరిలో దిగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. లేదంటే బీసీ నేతలు ఎల్​ రమణ, వకుళాభరణం కృష్ణ మోహన్​కు టికెట్​ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్​ మీద బలమైన నేతను బరిలోకి దించాలని కేసీఆర్​ భావిస్తున్నారట.

ఇందుకోసమే సుధీర్ఘ సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్టు టాక్​. అయితే కౌశిక్​రెడ్డి కాంగ్రెస్​లో ఉంటే ఆయనకు మంచి భవిష్యత్​ ఉండేదని.. ఇవాళ కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా ఆయన గెలిచేవారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక హుజూరాబాద్ లో టీఆర్​ఎస్​ ఎవరికి టికెట్ ఇస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది.

First Published:  1 Aug 2021 11:27 PM GMT
Next Story