Telugu Global
NEWS

హుజూరాబాద్​ టీఆర్​ఎస్​ అభ్యర్థిగా ప్రవీణ్​కుమార్​?

సీనియర్​ ఐపీఎస్​ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్​.ఎస్​ ప్రవీణ్​కుమార్​ స్వచ్ఛంద ఉద్యోగ‌ విరమణ తీసుకున్నారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఆయన పోటీచేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఆర్​.ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఎందరో విద్యార్థులకు ఆయన మెరుగైన శిక్షణ అందించారు. ఆయన స్వేరోస్​ అనే ఓ సంస్థను కూడా నెలకొల్పారు. అంబేద్కర్​, పూలే ఆశయసాధన కోసం పనిచేస్తానంటూ ఆయన ప్రకటించారు. ప్రవీణ్​ కుమార్​ స్థాపించిన స్వేరోస్​ సంస్థలో రాష్ట్రవ్యాప్తంగా సభ్యులు […]

హుజూరాబాద్​ టీఆర్​ఎస్​ అభ్యర్థిగా ప్రవీణ్​కుమార్​?
X

సీనియర్​ ఐపీఎస్​ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్​.ఎస్​ ప్రవీణ్​కుమార్​ స్వచ్ఛంద ఉద్యోగ‌ విరమణ తీసుకున్నారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఆయన పోటీచేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఆర్​.ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఎందరో విద్యార్థులకు ఆయన మెరుగైన శిక్షణ అందించారు. ఆయన స్వేరోస్​ అనే ఓ సంస్థను కూడా నెలకొల్పారు. అంబేద్కర్​, పూలే ఆశయసాధన కోసం పనిచేస్తానంటూ ఆయన ప్రకటించారు.

ప్రవీణ్​ కుమార్​ స్థాపించిన స్వేరోస్​ సంస్థలో రాష్ట్రవ్యాప్తంగా సభ్యులు ఉన్నారు. గురుకుల పూర్వ విద్యార్థులతో ఆయన ఈ సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో టీఆర్​ఎస్​ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. సమర్థుడైన అభ్యర్థి కోసం వెదుకుతున్నది. బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్​ పోటీచేస్తుండటంతో ఆయనకు దీటుగా అభ్యర్థిని నిలబెట్టాలని గులాబీ బాస్​ కేసీఆర్​ భావిస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పాడి కౌశిక్​రెడ్డి టీఆర్​ఎస్​లో చేరి .. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్​లో ఉండగానే.. ఆయనకు సంబంధించిన ఆడియో కాల్​ లీక్​ అయ్యింది. దీంతో కౌశిక్​ రెడ్డి ఇమేజ్​ దెబ్బతిన్నది. ఈ క్రమంలో కౌశిక్​కు టికెట్​ ఇస్తే నష్టం వాటిల్లుతుందని కేసీఆర్​ భావిస్తున్నారట. మరోవైపు ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన ఎల్​ రమణకు టికెట్​ ఇస్తారన్న టాక్​ కూడా వినిపించింది.

హుజూరాబాద్​ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్​ దళితులకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా దళిత బంధు అనే ఓ పథకానికి శ్రీకారం చుట్టారు. తాజాగా దళిత వర్గానికి చెందిన ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​కు టికెట్​ ఇవ్వాలని .. గులాబీ బాస్​ భావిస్తున్నారని సమాచారం.

ప్రవీణ్​కుమార్​.. హుజూరాబాద్​కు స్థానికేతరుడు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్​ ప్రవీణ్​కుమార్​ నియోజకవర్గం. అయితే గతంలో ఆయన కరీంనగర్​ కలెక్టర్​గా పనిచేశారు. ఆ సమయంలో ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలని కేసీఆర్​ భావించారని టాక్​. రాజకీయాల్లోకి రావడం పట్ల ప్రవీణ్​కుమార్​ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

First Published:  19 July 2021 9:51 AM GMT
Next Story