Telugu Global
National

రజినీ మక్కల్ మండ్రం రద్దు..! పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన తలైవా..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోనని ప్రకటించారు. రాజకీయాల కోసం ఏర్పాటుచేసిన రజినీ మక్కల్ మండ్రం ను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ స్థానంలో రజినీ అభిమానుల సంక్షేమ సంఘం స్థాపిస్తునట్లు చెప్పారు. గత ఏడాది తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే పార్టీ పేరు, సిద్ధాంతాలు ప్రకటిస్తానని తెలిపిన రజినీకాంత్ అనూహ్యంగా రాజకీయాలకు వీడ్కోలు పడుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అయితే ఆయనకు […]

రజినీ మక్కల్ మండ్రం రద్దు..! పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన తలైవా..!
X

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోనని ప్రకటించారు. రాజకీయాల కోసం ఏర్పాటుచేసిన రజినీ మక్కల్ మండ్రం ను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ స్థానంలో రజినీ అభిమానుల సంక్షేమ సంఘం స్థాపిస్తునట్లు చెప్పారు. గత ఏడాది తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే పార్టీ పేరు, సిద్ధాంతాలు ప్రకటిస్తానని తెలిపిన రజినీకాంత్ అనూహ్యంగా రాజకీయాలకు వీడ్కోలు పడుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

అయితే ఆయనకు ఎన్నికలకు ముందు కరోనా రావడం, వైరస్ వ్యాప్తి దృష్ట్యా జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో తానిక రాజకీయాల్లోకి రానని ప్రకటించి అభిమానులను నిరాశ పరిచారు. అనంతరం తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

కాగా గత నెల 19వ తేదీన రజినీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకొని 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడి మయో క్లినిక్ లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే వైద్యపరీక్షల్లో ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, మరో ఐదేళ్ల పాటు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. అనంతరం కొద్ది రోజులు అమెరికాలోనే విశ్రాంతి తీసుకున్న తర్వాత రజినీకాంత్ తిరిగి ఇటీవల ఇండియాకు చేరుకున్నారు.

ఈనెల 12వ తేదీన రజినీ మక్కల్ మండ్రం నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తలైవా ప్రకటించారు. తమిళనాడు లో అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకే రజినీ అభిమానులతో సమావేశం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇవాళ చెన్నైలో రజినీకాంత్ తన అభిమానులతో సమావేశం నిర్వహించారు. అయితే అందరూ ఊహించని విధంగా రజినీకాంత్ రాజకీయాల నుంచి శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.

ఇక రాజకీయాలు చేయాల్సిన అవసరం లేనప్పుడు రజినీ మక్కల్ మండ్రం కూడా అవసరం లేదని దానిని కూడా రద్దు చేశారు. ఆ స్థానంలో రజినీ అభిమానుల సంక్షేమ సంఘం స్థాపిస్తునట్లు ప్రకటించారు. రజినీకాంత్ రాజకీయాల పై చేసిన సంచలన ప్రకటన మరోసారి చర్చనీయాంశమైంది.

First Published:  12 July 2021 3:24 AM GMT
Next Story