Telugu Global
NEWS

కేటీఆర్​కు నిరసన సెగ.. కాన్వాయ్​ని అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థులు..!

రాష్ట్ర మున్సిపల్​, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​కు నిరసన సెగ తాకింది. కేటీఆర్​ కాన్వాయ్​ ని ఏబీవీవీ విద్యార్థులు అడ్డుకున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వివిధ పట్టణాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మంత్రి కేటీఆర్​ నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే మంత్రి కాన్వాయ్​ ని ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు. తెలంగాణలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని.. ఖాళీలను […]

కేటీఆర్​కు నిరసన సెగ.. కాన్వాయ్​ని అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థులు..!
X

రాష్ట్ర మున్సిపల్​, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​కు నిరసన సెగ తాకింది. కేటీఆర్​ కాన్వాయ్​ ని ఏబీవీవీ విద్యార్థులు అడ్డుకున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వివిధ పట్టణాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మంత్రి కేటీఆర్​ నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అయితే మంత్రి కాన్వాయ్​ ని ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు. తెలంగాణలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని.. ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్​ చేశారు. అయితే ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్​ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణపేటలో కాస్త ఉద్రిక్తత నెలకొన్నది.

నారాయణ పేటలో కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సావర్కర్ చౌరస్తా వరకు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించే సివిల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు, సింగారం చౌరస్తా వద్ద పది కోట్ల రూపాయలతో నిర్మించే టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి, అశోక్ నగర్ వద్ద రూ. 20 లక్షలతో అమరవీరుల స్తూపం నిర్మాణానికి‌ మంత్రి శంకుస్థాపన చేశారు.

అనంతరం నారాయణపేట ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్లతో ఏర్పాటుచేసిన వార్డును మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. సాయివిజయ కాలనీలో రూ. 70 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్​ కాన్వాయ్​ ని ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఓ వైపు ప్రతిపక్షాలు ఉద్యోగాల నోటిఫికేషన్​ విడుదల చేయాలంటూ డిమాండ్​ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్​రెడ్డి సైతం తొలి కార్యవర్గ సమావేశంలో.. నిరుద్యోగ సమస్యపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు కొత్త పార్టీ పెట్టిన వైఎస్​ షర్మిల ఈ విషయంపైనే పోరాడుతానంటోంది. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్​ ని విద్యార్థులు అడ్డుకోవడం గమనార్హం.

First Published:  10 July 2021 3:40 AM GMT
Next Story