Telugu Global
NEWS

రైతులు చల్లగా ఉంటే బాబు కళ్లు మండుతాయి.. విజయ​సాయి రెడ్డి ఘాటు ట్వీట్లు..!

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వైఎస్సార్​సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్​ అయ్యారు. చంద్రబాబు ప్రాజెక్టులపై తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయిస్తూ అడ్డుతగులుతున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సొంత జిల్లా చిత్తూరుకు ప్రాజెక్టులు రావడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. చంద్రబాబు లాంటి నీచుడు చిత్తూరు […]

రైతులు చల్లగా ఉంటే బాబు కళ్లు మండుతాయి.. విజయ​సాయి రెడ్డి ఘాటు ట్వీట్లు..!
X

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వైఎస్సార్​సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్​ అయ్యారు. చంద్రబాబు ప్రాజెక్టులపై తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయిస్తూ అడ్డుతగులుతున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సొంత జిల్లా చిత్తూరుకు ప్రాజెక్టులు రావడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు.

చంద్రబాబు లాంటి నీచుడు చిత్తూరు జిల్లాలో పుట్టడం ఇక్కడ ప్రజల దురదృష్టం అంటూ ఆయన మండిపడ్డారు. ‘గతంలో దివంగత నేత, వైఎస్సార్​ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపడితే వాటిని చంద్రబాబు అడ్డుకున్నాడు. తన మనుషులతో కేసులు వేయించి ప్రాజెక్టులను ఆపాడు.

ప్రస్తుతం సీఎం జగన్​మోహన్​రెడ్డి.. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులు కడుతుంటే వాటిని కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడు .. తన మనుషులతో కేసులు వేయిస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆపాలంటూ చంద్రబాబు మనుషులు గ్రీన్​ ట్రిబ్యునల్​లో కేసులు వేశారు. చిత్తూరు జిల్లాలోని 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకోవాలని భావిస్తున్నాడు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్​ చేశారు.

‘చంద్రబాబు లాంటి వాడికి ఎందుకు జన్మనిచ్చానా? అంటూ చిత్తూరు జిల్లా ఆవేదన చెందుతోంది. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వాడికి ఇదో లెక్కా’ అంటూ ఆయన ట్వీట్​ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రం అక్రమంగా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నదని.. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్​ ఉత్పత్తి చేస్తుందని గతంలో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నదని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రులు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నారు.

First Published:  6 July 2021 7:21 AM GMT
Next Story