Telugu Global
National

వ్యాక్సిన్​ వికటించి తొలిమరణం.. ధ్రువీకరించిన కేంద్రం..!

కరోనా వ్యాక్సిన్​ వికటించి విదేశాల్లో తీవ్ర సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో కొందరికి తీవ్ర అనారోగ్యం వాటిల్లింది. బ్రిటన్​లో కొంతమంది వ్యాక్సిన్​ తీసుకొని మృతిచెందారు కూడా. అయితే మనదేశంలో మాత్రం ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్​ తో సైడ్​ ఎఫెక్ట్స్​ పెద్దగా రాలేదు. వ్యాక్సిన్​ తీసుకున్నాక గుండెపోటుతో కొందరు మృతిచెందినట్టు అక్కడక్కడా వార్తలు వచ్చాయి. కానీ వారు వ్యాక్సిన్ కారణంగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్​ తీసుకొని […]

వ్యాక్సిన్​ వికటించి తొలిమరణం.. ధ్రువీకరించిన కేంద్రం..!
X

కరోనా వ్యాక్సిన్​ వికటించి విదేశాల్లో తీవ్ర సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో కొందరికి తీవ్ర అనారోగ్యం వాటిల్లింది. బ్రిటన్​లో కొంతమంది వ్యాక్సిన్​ తీసుకొని మృతిచెందారు కూడా. అయితే మనదేశంలో మాత్రం ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్​ తో సైడ్​ ఎఫెక్ట్స్​ పెద్దగా రాలేదు. వ్యాక్సిన్​ తీసుకున్నాక గుండెపోటుతో కొందరు మృతిచెందినట్టు అక్కడక్కడా వార్తలు వచ్చాయి. కానీ వారు వ్యాక్సిన్ కారణంగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్​ తీసుకొని చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఓ వృద్ధుడికి (68) వ్యాక్సిన్​ తీసుకున్న అనంతరం తీవ్రమైన సైడ్​ఎఫెక్ట్స్​ వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్​ కమిటీ గుర్తించింది. అతడికి అనఫిలాక్సిస్‌ రావడంతో మృతిచెందినట్టు కమిటీ నిర్ధారించింది.

మనదేశంలో వ్యాక్సిన్​ తీసుకొని మరణించిన వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వం ఈ వృద్ధుడిని గుర్తించింది. అనఫిలాక్సిస్‌ అంటే తీవ్రమైన అలర్జీ. కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న చాలా మందిలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలా మందికి ఈ లక్షణాలు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవాళ్లలో పరిస్థితి విషమించే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ వ్యాక్సిన్​ తీసుకున్న అనంతరం ఎవరికైనా అలర్జీ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

First Published:  15 Jun 2021 9:59 AM GMT
Next Story