Telugu Global
NEWS

తొలివరమిచ్చిన పోలవరం..

ప్రాజెక్ట్ ఇంకా పూర్తికాకముందే పోలవరం తొలి ఫలితం వచ్చేసింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటి విడుదలకు నేడు అంకురార్పణ జరిగింది. గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ ఛానల్ ద్వారా స్పిల్ వేకు మళ్లిస్తున్న సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పిల్ వే మీదుగా గోదావరి డెల్టాకు నీరు విడుదల చేస్తున్నారు.. గోదావరి డెల్టాకు తొలి ఫలితం.. తొలుత గోదావరి నది నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల చేస్తారు. స్పిల్ వే పైనుంచి, రివర్ […]

తొలివరమిచ్చిన పోలవరం..
X

ప్రాజెక్ట్ ఇంకా పూర్తికాకముందే పోలవరం తొలి ఫలితం వచ్చేసింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటి విడుదలకు నేడు అంకురార్పణ జరిగింది. గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ ఛానల్ ద్వారా స్పిల్ వేకు మళ్లిస్తున్న సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పిల్ వే మీదుగా గోదావరి డెల్టాకు నీరు విడుదల చేస్తున్నారు..

గోదావరి డెల్టాకు తొలి ఫలితం..
తొలుత గోదావరి నది నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల చేస్తారు. స్పిల్ వే పైనుంచి, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు ఈ ప్రవాహం చేరుతుంది. కాటన్ బ్యారేజ్ నుంచి సెంట్రల్ డెల్టాతోపాటు తూర్పు, పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాను సశ్యశ్యామలం చేస్తుంది. సహజంగా గోదావరిలో ప్రవహించే నీరు బ్యారేజ్ నుంచి డెల్టాకు చేరుతుంది. పోలవరం పూర్తయిన తర్వాత స్పిల్ వే – రివర్ స్లూయిజ్ – పవర్ హౌస్ డిశ్చార్జ్ ల ద్వారా బ్యారేజ్ నుంచి కాల్వలకు చేరుతుంది. ప్రస్తుతానికి పోలవరం నిర్మాణంలోనే ఉన్నా.. ప్రాజెక్ట్ పూర్తయితే ఎలాంటి ఫలితం అందుతుందో అలాగే ఇప్పుడు కాల్వల ద్వారా నీరు గోదావరి డెల్టాకు చేరుతుండటంతో.. తొలి ఫలితం అందినట్టయింది.

ఛాలెంజింగ్ గా తీసుకుని పనులు పూర్తి చేసిన మేఘా..
పోలవరం నిర్మాణంలో స్పిల్ వేతో పాటు మూడు గ్యాప్ లు (ఈసీఆర్ఎఫ్ 1,2,3) తో పాటు జల విద్యుత్ కేంద్రం, జల రవాణా పనులు కీలకమైనవి. ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా (వర్క్ మ్యానువల్, ప్రోటోకాల్) స్పిల్ వే పనిని మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేసింది. గోదావరి నీటిని అప్రోచ్ ఛానెల్ నుంచి దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానెల్ ద్వారానే విడుదలవుతుంది. ఇక నుంచి ఏడాది పొడవునా నీటిని అప్రోచ్ ఛానెల్ ద్వారా మళ్లించి, పైలెట్ ఛానెల్ ద్వారా మళ్లీ గోదావరిలోకి కలుపుతారు.

6.6 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం మళ్లింపు..
గోదావరి నది నీటిని 6.6 కిలోమీటర్ల మేరకు మళ్లించడమనేది అసాధారణ విషయం. గోదావరి సహజ ప్రవాహాన్ని పోలవరం వద్ద కుడివైపుకి మళ్లిస్తారు. అప్రోచ్ ఛానెల్ నుంచి పైలెట్ ఛానెల్ వరకు ఇలా మళ్లిస్తారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కూడా ఈ ప్రక్రియ అలాగే కొనసాగుతుంది. దీనికోసం నది మధ్యలో మూడు గ్యాప్ లు (1,2,3) నిర్మించాలి. వీటిలో గ్యాప్-2 గా పిలిచే ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం) అతిపెద్దది. 50లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహ ఒత్తిడిని తట్టుకునేలా దీనిని నిర్మిస్తారు. ఈ పని ప్రారంభం కావాలంటే నీటి ప్రవాహం ఉండకూడదు. దీనికోసం అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించి ఈ ఏడాది వచ్చే వరదల్లో కూడా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

వరదలను తట్టుకునేలా నిర్మాణాలు.
అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మొత్తం పొడవు 6.6 కిలోమీటర్లు. ప్రధాన నదికి కుడివైపున సమాంతరంగా వీటిని నిర్మించారు. అప్రోచ్ ఛానెల్ స్పిల్ వే వైపు 2.4 కిలోమీటర్ల వరకు నిర్మించారు. స్పిల్ వే నుంచి స్పిల్ ఛానెల్ 3.1 కిలోమీటర్లు ఉంటుంది. స్పిల్ ఛానెల్ చివరి నుంచి మళ్లీ గోదావరి తన సహజసిద్ధ ప్రవాహంలోకి కలిసే విధంగా 1.1 కిలోమీటర్ల పొడవున పైలెట్ ఛానెల్ నిర్మించారు. 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తున ఎగువ కాఫర్ డ్యాం ను మూడు రీచ్ లుగా నిర్మించారు. ఇటీవలే అప్పర్ కాఫర్ డ్యాం గ్యాప్ లను ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పూడ్చివేశారు. దీని ఫలితంగా 30లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చినా నదిలో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవాహం అప్రోచ్ ఛానెల్ మీదుగా వెళ్లిపోతుంది.

రికార్డ్ సమయంలో పనులు పూర్తి..
గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించే పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపున స్పిల్ వేకు చేరాలంటే కనీస మట్టానికి నదిని తవ్వాలి. అందుకోసం అప్రోచ్ ఛానెల్ ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దీంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఇందుకోసం కోటి 54 లక్షల 88వేల ఘనపు మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కోటి 4లక్షల 88వేల ఘనపు మీటర్ల మేర పని పూర్తయింది. ప్రపంచంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్ స్పిల్ వే గా చైనాలోని త్రిగోర్జెస్ జలాశయంకు పేరుంది. దీని కన్నా పోలవరం సామర్థ్యం మూడు లక్షల క్యూసెక్కులు అధికం కావడం విశేషం. దీనిని తట్టుకునేలా ప్రపంచంలోనే అతిపెద్ద గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

హెడ్ వర్క్ పనులు 76.29శాతం పూర్తి…
పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటివరకు 76.29శాతం హెడ్ వర్క్స్ పనులు పూర్తయ్యాయి. పోలవరం వరద నీటిని అప్రోచ్ ఛానెల్ మీదుగా మళ్లిస్తున్నందున పోలవరంతోపాటు పలు గ్రామాలు ముంపు బారినపడే ప్రమాదం ఉంది. నీటి ప్రవాహం 12లక్షల క్యూసెక్కులకు చేరిన స్పిల్ వే లో ప్రభావం కనిపిస్తుంది. కనీస ప్రవాహం ఉన్నప్పుడు తొమ్మిది ఆవాసాల్లోకి నీరు ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం 28 మీటర్లు దాటిన తరువాత ముంపుకి గురయ్యే ఆవాసాల సంఖ్య పెరుగుతుంది. పూర్తి స్థాయిలో స్పిల్ వే వరకు (45.72 మీటర్లు) నీరు చేరేతే 235 ఆవాసాలు ముంపు భారీన పడతాయి. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసి ముంపు గ్రామాల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలిస్తుంది. ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రక్రియ మొదలు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  11 Jun 2021 3:52 AM GMT
Next Story