Telugu Global
National

సోనూసూద్​ కు ఇంజెక్షన్లు ఎక్కడివి? కోర్టు ప్రశ్న..!

కరోనా వేళ ప్రముఖ నటుడు సోనూసూద్​ ఎందరో పేద ప్రజల ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. దీంతో అతడికి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఇదిలా ఉంటే ఆక్సిజన్​ కోసం ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్న వేళ సోనూసూద్​ కు ఆక్సిజన్​ ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పటికే పలువురు ప్రశ్నించారు. మరోవైపు అతడికి కరోనా మందులు, ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని.. ఇందులో ఏదైనా బ్లాక్​మార్కెట్​ ఉందా? అంటూ నేరుగా హైకోర్టే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం కరోనా వేళ.. సెలబ్రిటీలు, […]

సోనూసూద్​ కు ఇంజెక్షన్లు ఎక్కడివి? కోర్టు ప్రశ్న..!
X

కరోనా వేళ ప్రముఖ నటుడు సోనూసూద్​ ఎందరో పేద ప్రజల ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. దీంతో అతడికి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. ఇదిలా ఉంటే ఆక్సిజన్​ కోసం ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్న వేళ సోనూసూద్​ కు ఆక్సిజన్​ ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పటికే పలువురు ప్రశ్నించారు.

మరోవైపు అతడికి కరోనా మందులు, ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని.. ఇందులో ఏదైనా బ్లాక్​మార్కెట్​ ఉందా? అంటూ నేరుగా హైకోర్టే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం కరోనా వేళ.. సెలబ్రిటీలు, రాజకీయనేతలు మందులు పంపిణీ చేస్తుండటంపై కోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ఓ వైపు ప్రజలకు మందులు దొరకడంలేదు. మరి రాజకీయ నాయకులకు ఎలా దొరుకుతున్నాయి. కంపెనీలు నేరుగా వారికే ఇస్తున్నాయా? లేక ఇందులో ఏదైనా బ్లాక్​మార్కెట్​ ఉందా? అని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. కోవిడ్ డ్రగ్స్ పై అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని హైకోర్టు గుర్తు చేసింది.

‘ప్రజలకు మంచి చేయాలని భావించడంలో తప్పులేదు. కానీ ఈ క్రమంలో బ్లాక్​దందా జ‌రిగితే అది నేరమే’ అని హైకోర్టు పేర్కొన్నది. మరోవైపు పేద ప్రజలకు కోవిడ్​ మందులు ఉచితంగా సరఫరా చేస్తున్న కాంగ్రెస్​ ఎమ్మెల్యే జీషన్​ సిద్దిఖీ, సోనూసూద్​ చారిటీకి కేంద్రం నోటీసులు జారీచేసింది.

అయితే దేశంలో పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న సోనూసూద్ ​కు నోటీసులు అందించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎలాగూ మందులు సరఫరా చేయవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత ఉంది. రెమ్ డెసివిర్​ ఇంజెక్షన్లు ఉండవు. కానీ స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్లకు ఇలా అడ్డంకులు సృష్టిస్తారు అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

First Published:  28 May 2021 1:12 AM GMT
Next Story