Telugu Global
NEWS

జూలై 23న టీడీపీకి ఏం రాసి పెట్టి ఉందో..? " విజయసాయి సెటైర్లు..

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుని విమర్శిస్తూ వేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆ ట్వీట్ లో అసలు విషయం చెప్పకుండా చిన్న టీజర్ వదిలారు విజయసాయిరెడ్డి. అసలు జూలై 23న టీడీపీలో ఏం జరుగుతుందోనన్న కుతూహలం అందరిలో బయలుదేరింది. పైగా చేతిదెబ్బ, చెంపదెబ్బ అన్నట్టుగా.. అని ప్రత్యేకించి ప్రస్తావించారంటే, టీడీపీ విషయంలో ఏదో కీలక పరిణామం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామానా..? అంతకు మించి ఇంకేదైనా జరుగుతుందా..? అంటూ నెటిజన్లు […]

జూలై 23న టీడీపీకి ఏం రాసి పెట్టి ఉందో..?  విజయసాయి సెటైర్లు..
X

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుని విమర్శిస్తూ వేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆ ట్వీట్ లో అసలు విషయం చెప్పకుండా చిన్న టీజర్ వదిలారు విజయసాయిరెడ్డి. అసలు జూలై 23న టీడీపీలో ఏం జరుగుతుందోనన్న కుతూహలం అందరిలో బయలుదేరింది. పైగా చేతిదెబ్బ, చెంపదెబ్బ అన్నట్టుగా.. అని ప్రత్యేకించి ప్రస్తావించారంటే, టీడీపీ విషయంలో ఏదో కీలక పరిణామం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామానా..? అంతకు మించి ఇంకేదైనా జరుగుతుందా..? అంటూ నెటిజన్లు విజయసాయి ట్వీట్లకు రిప్లై ఇస్తున్నారు.

ఇంతకీ ఆయన ట్వీట్ లో ఏముందంటే..?
“23వ తేదీ టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23కే టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ – చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో?” అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. ఈ నెల 23నాటికి ఏపీలో వైసీపీ విజయానికి, టీడీపీ ఘోర పరాజయానికి రెండేళ్లు పూర్తి కావడంతో, దానికి కొనసాగింపుగా ఈ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

శవరాజకీయాలేంటి బాబూ..?
మత్తు డాక్టర్ సుధాకర్ సహజ మరణాన్ని కూడాచంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. “డాక్టర్ సుధాకర్ గుండెపోటు/కరోనాతో మరణిస్తే ప్రభుత్వం కోటి ఇవ్వాలంటున్నావ్. నీ వెన్నెపోటుకు బలైన ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావ్? నీవు రెచ్చగొట్టడంతో సస్పెండ్ అయిన డా. సుధాకర్ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావ్? వారి కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటే నీ శవ రాజకీయాలేంటి?” అంటూ ప్రశ్నించారు.

నాన్నా నన్నెందుకు ఎమ్మెల్యేని చేయలేదు..?
ట్విట్టర్ లో టీడీపీపై విమర్శల ఎపిసోడ్ ఎప్పుడు మొదలు పెట్టినా.. కచ్చితంగా నారా లోకేష్ పై పంచ్ మాత్రం మిస్ కాకుండా చూస్తారు విజయసాయిరెడ్డి. ఈ దఫా చంద్రబాబు-లోకేష్ మధ్య జరిగిన సంభాషణ అంటూ ఓ సెటైర్ పేల్చారు. “నాన్నా నువ్వు చాలామందిని దేశానికి ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని చేశానని చెప్పుకుంటావు కదా, మరి సొంత కొడుకునైన నన్నెందుకు కనీసం ఎమ్మెల్యేగా కూడా చేయలేకపోయావ్” అని లోకేష్ ప్రశ్నించారని, దానికి బాబు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో, చివరకు అదంతా వట్టి మోసం అని తెలుసుకుని సైలెంట్ అయ్యారని తండ్రీ కొడుకులపై చెణుకులు విసిరారు.

First Published:  23 May 2021 9:05 PM GMT
Next Story