Telugu Global
NEWS

సోనూ సూద్​ తొలి ఆక్సిజన్​ ప్లాంట్​.. ఆంధ్రప్రదేశ్​లోనే..!

కరోనా వేళ .. సోనూ సూద్​ ఎవరి ఊహకు అందనంత సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్​లో ఎందరో వలస కూలీలను సోనూ సూద్​ ఆదుకున్నాడు. అనేకమంది పేద ప్రజలకు, ఉపాధి కోల్పోయిన వారికి తనవంతు సాయం చేశాడు. ప్రాంతాలు, కులాలు, రాజకీయపార్టీలకతీతంగా అందరికీ మేలు చేశాడు. ఇక సెకండ్​ వేవ్​లో కూడా సోనూ సూద్​ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది కోవిడ్​ బాధితులకు ఆక్సిజన్​ అందించాడు. సొంతంగా ఓ ఫౌండేషన్​ […]

సోనూ సూద్​ తొలి ఆక్సిజన్​ ప్లాంట్​.. ఆంధ్రప్రదేశ్​లోనే..!
X

కరోనా వేళ .. సోనూ సూద్​ ఎవరి ఊహకు అందనంత సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్​లో ఎందరో వలస కూలీలను సోనూ సూద్​ ఆదుకున్నాడు. అనేకమంది పేద ప్రజలకు, ఉపాధి కోల్పోయిన వారికి తనవంతు సాయం చేశాడు.

ప్రాంతాలు, కులాలు, రాజకీయపార్టీలకతీతంగా అందరికీ మేలు చేశాడు. ఇక సెకండ్​ వేవ్​లో కూడా సోనూ సూద్​ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది కోవిడ్​ బాధితులకు ఆక్సిజన్​ అందించాడు. సొంతంగా ఓ ఫౌండేషన్​ నెలకొల్పి దాని ద్వారా సాయం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే సోనూ సూద్​ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్​ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే తొలి ఆక్సిజన్​ ప్లాంట్​ ఆంధ్రప్రదేశ్​లోనే నెలకొల్పబోతున్నట్టు సమాచారం.
ఇప్పటికే యూఎస్, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు సోనూ సూద్​ కృషి చేస్తున్నాడు. అయితే మొదటి రెండు ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరులో నెలకొల్పేందుకు సోనూ సూద్​ కృషి చేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం సోనూ సూద్​ అతడి టీం కర్నూలులో పర్యటిస్తున్నది. అక్కడ ఆక్సిజన్​ ప్లాంట్ నెలకొల్పేందుకు ఉండే అవకాశాలపై వారు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఇతర సంబంధిత అధికారుల నుంచి కూడా వారు అనుమతులు తీసుకున్నారు.

ఈ విషయంపై కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. ’ సోనూ సూద్​ ఆక్సిజన్​ ప్లాంట్​ నెలకొల్పేందుకు ముందుకు రావడం ఎంతో సంతోషకరం. ఈ ఆక్సిజన్​ ప్లాంట్​తో రోజుకు 200 నుంచి 300 మంది కోవిడ్​ బాధితులకు ఆక్సిజన్ అందే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

First Published:  22 May 2021 10:48 AM GMT
Next Story