Telugu Global
Cinema & Entertainment

కరోనా నిధికి సూర్య బ్రదర్స్ రూ. కోటి విరాళం

తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సూర్య. ఆయన కోలీవుడ్ నటుడు అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ సినీ ఇండస్ట్రీలో సూర్య దయాగుణం కలిగినవాడనే పేరుంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలోనూ ఆయన ముందుంటారు. తన తమ్ముడు, సినీ నటుడు కార్తీతో కలిసి అగరం ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. తాజాగా సూర్య బ్రదర్స్ తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కరోనా […]

కరోనా నిధికి సూర్య బ్రదర్స్ రూ. కోటి విరాళం
X

తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సూర్య. ఆయన కోలీవుడ్ నటుడు అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ సినీ ఇండస్ట్రీలో సూర్య దయాగుణం కలిగినవాడనే పేరుంది.

ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలోనూ ఆయన ముందుంటారు. తన తమ్ముడు, సినీ నటుడు కార్తీతో కలిసి అగరం ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు.

తాజాగా సూర్య బ్రదర్స్ తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కరోనా నివారణ నిధికి రూ.కోటి విరాళం అందించారు. తమిళనాడు రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజూ అక్కడ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఆస్పత్రుల్లో బాధితులకు బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్ కొరత కూడా వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సేకరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. సీఎం పిలుపుతో సీనియర్ నటుడు శివకుమార్ కుటుంబం స్పందించింది.

బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్ ను శివ కుమార్, ఆయన తనయులు సూర్య, కార్తీ కలిశారు. కరోనాపై పోరులో తమ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కరోనా నిధికి కోటి రూపాయలు విరాళం అందజేశారు.

First Published:  13 May 2021 12:10 AM GMT
Next Story