Telugu Global
NEWS

కౌశిక్​ ఓ వైపు.. సీనియర్లు మరోవైపు.. కాంగ్రెస్​లో విచిత్ర పరిస్థితి?

ఈటల రాజేందర్​ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్​లో చిచ్చు పెట్టింది. ఈటల రాజేందర్​పై ఇటీవల భూ కబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌​ చేశారు సీఎం కేసీఆర్​. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్​కు అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్​ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక […]

కౌశిక్​ ఓ వైపు.. సీనియర్లు మరోవైపు.. కాంగ్రెస్​లో విచిత్ర పరిస్థితి?
X

ఈటల రాజేందర్​ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్​లో చిచ్చు పెట్టింది. ఈటల రాజేందర్​పై ఇటీవల భూ కబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌​ చేశారు సీఎం కేసీఆర్​. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్​కు అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్​ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక ఆయన బీసీ నాయకుడు కూడా. దీంతో ఆయనకు వివిధ వర్గాల మద్దతు దక్కింది.

ఇటీవల ఈటల రాజేందర్​ కొందరు ఉద్యమకారులను, వివిధ పార్టీల నేతలను కూడా కలుస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్​ సీనియర్​ నేతలు రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, వీహెచ్​, దాసోజు శ్రవణ్​, జీవన్​రెడ్డి తదితరులు ఈటలకు మద్దతుగా నిలిచారు. సీఎం కేసీఆర్​ ఈటల రాజేందర్​పై కుట్రలు చేసి.. ఆయనను బయటకు పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్​ఎస్​కు చెందిన చాలా మంది నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చాయని.. కానీ ఒక్క ఈటల రాజేందర్​ను మాత్రమే ఎందుకు టార్గెట్​ చేస్తున్నారని వారంతా ప్రశ్నించారు.

కాంగ్రెస్​ నేతలంతా ఈటల రాజేందర్​కు మద్దతు తెలుపుతుంటే.. హుజురాబాద్​ నియోజకవర్గ కాంగ్రెస్​ నేత పాడి కౌశిక్​రెడ్డి మాత్రం ఈటల కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్​ ముఖ్యనేతలంతా ఓ స్టాండ్​ తీసుకుంటే కౌశిక్​ రెడ్డి మరో స్టాండ్​ తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్​ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

టీఆర్​ఎస్​ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈటల రాజేందర్​పై పెద్దగా బహిరంగ ఆరోపణలు చేయడం లేదు. ఇటీవల కరీంనగర్​ జిల్లాకు చెందిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ , మంత్రులు గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​ మాత్రం ఈటలపై విమర్శలు చేశారు. ఆ తర్వాత వాళ్లు కూడా సైలెంట్​ అయిపోయారు. ఇదిలా ఉంటే హుజురాబాద్​కు చెందిన కాంగ్రెస్​ ఇంచార్జి పాడి కౌశిక్​ రెడ్డి ఈటలపై ఓ రేంజ్​లో ఫైర్​ అవుతున్నారు.

నిత్యం సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉండే కౌశిక్​రెడ్డి .. ప్రస్తుతం ఈటలపై విరుచుకుపడుతున్నారు. వివిధ న్యూస్​ చానల్స్ లో లైవ్​ డిబేట్లలో పాల్గొంటూ ఈటల రాజేందర్​పై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్​ అగ్రనేతలు ఈటలకు మద్దతు ఇస్తుండగా.. పాడి కౌశిక్​ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు.

త్వరలో ఈటల రాజేందర్​ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే కౌశిక్​ రెడ్డి టీఆర్​ఎస్​ నుంచి పోటీచేసే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదంతా జరుగుతున్నా కాంగ్రెస్​ అధిష్ఠానం మాత్రం ఉలుకు పలుకు లేకుండా చూస్తున్నది. మరోవైపు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డికి పాడి కౌశిక్​ రెడ్డి సమీప బంధువు కూడా. ఆయన గతంలో కొంతకాలం క్రికెటర్​గా రాణించారు.

First Published:  13 May 2021 6:08 AM GMT
Next Story