Telugu Global
National

వెనక్కి వెళ్లి ఛాయ్ అమ్ముకుంటా.. మోదీ ట్వీట్ వైరల్..

దేశంలో ఇప్పుడున్న పరిస్థితులకు మోదీ కారణమని.. ఇక్కడి మీడియాతో పాటు విదేశీ మీడియా కూడా విమర్శిస్తోంది. కేంద్రం నిర్ణయాల పట్ల సుప్రీం కోర్టు కూడా అసహనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో మోదీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. ట్విట్టర్ లో ఇప్పుడు రిజైన్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ‘మోదీ రాజకీయం చేస్తూ.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టారని పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఈ […]

వెనక్కి వెళ్లి ఛాయ్ అమ్ముకుంటా.. మోదీ ట్వీట్ వైరల్..
X

దేశంలో ఇప్పుడున్న పరిస్థితులకు మోదీ కారణమని.. ఇక్కడి మీడియాతో పాటు విదేశీ మీడియా కూడా విమర్శిస్తోంది. కేంద్రం నిర్ణయాల పట్ల సుప్రీం కోర్టు కూడా అసహనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో మోదీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అదేంటంటే..

ట్విట్టర్ లో ఇప్పుడు రిజైన్ మోదీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ‘మోదీ రాజకీయం చేస్తూ.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టారని పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఈ సందర్భంలో.. మోదీ 2014లో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. 2014లో జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా.. ‘దేశానికి బలమైన నాయకత్వం కావాలి. ఇక్కడ మోదీ పేరు పెద్ద విషయం కాదు. మోదీ.. వెనక్కి వెళ్లి.. మళ్లీ ఛాయ్ అమ్ముకోవచ్చు. కానీ, దేశం ముఖ్యం’ అని అప్పుడు మోదీ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌కు అనుసంధానంగా కొందరు కామెంట్స్ చేస్తూ.. ‘2014కి ముందు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇతర పార్టీ నాయకుల పట్ల.. అధికార పార్టీ నేతలకు గౌరవం ఉండేది. బ్యూరోక్రాట్ల ఆధిపత్యం ఉండేది కాదు’ అని అంటున్నారు. అలా ఈ ట్వీట్, దాని కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

First Published:  29 April 2021 7:27 AM GMT
Next Story