Telugu Global
NEWS

జనసేనకు ఊహించని ఎదురుదెబ్బ.. ‘గ్లాస్’​ పోయింది

తెలంగాణలో త్వరలో మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి ఊహించని షాక్​ తగిలింది. ఆ పార్టీకి గ్లాస్​ గుర్తు తీసేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జనసేన తెలంగాణలో గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో, అంతకుముందు కూడా పోటీచేయలేదు. కానీ ఆ పార్టీ ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో జనసేనతోపాటు పలు పార్టీల కామన్​ గుర్తులను తొలగించినట్టు ఎన్నికల సంఘం పేర్కొన్నది. జనసేన(గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్‌ సిలిండర్‌), […]

జనసేనకు ఊహించని ఎదురుదెబ్బ.. ‘గ్లాస్’​ పోయింది
X

తెలంగాణలో త్వరలో మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి ఊహించని షాక్​ తగిలింది. ఆ పార్టీకి గ్లాస్​ గుర్తు తీసేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జనసేన తెలంగాణలో గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో, అంతకుముందు కూడా పోటీచేయలేదు. కానీ ఆ పార్టీ ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో జనసేనతోపాటు పలు పార్టీల కామన్​ గుర్తులను తొలగించినట్టు ఎన్నికల సంఘం పేర్కొన్నది.

జనసేన(గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్‌ సిలిండర్‌), ఇండియన్‌ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్‌), హిందుస్థాన్‌ జనతా పార్టీ (కొబ్బరి తోట) కామన్‌ గుర్తులను కోల్పోయాయి. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో జనసేన కనీసం 10 శాతం సీట్లకు కూడా అభ్యర్థులను పోటీకి నిలపలేదు. దీంతో ఆ పార్టీ గుర్తును రద్దు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్​ కార్యదర్శి ఎం. అశోక్​కుమార్​ పేర్కొన్నారు.

గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో జనసేన.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. దీంతో ఆ పార్టీ కోరిక మేరకు పోటీ నుంచి తప్పుకున్నది. అయితే త్వరలో జరగబోయే ఖమ్మం, వరంగల్​ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో పోటీచేయాలని జనసేన నిర్ణయించుకున్నది. ఈ మేరకు తమకు కామన్​ గుర్తు కేటాయించాలని జనసేనాని పవన్​ కల్యాణ్​ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

అయితే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 10 శాతం స్థానాల్లో కూడా పోటీచేయనందున కామన్​ గుర్తు ఇవ్వలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జనసేనతో సహా ఇతరపార్టీలు 2025 నవంబర్‌ 18 వరకు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదని పేర్కొంది.

First Published:  16 April 2021 11:27 PM GMT
Next Story