Telugu Global
National

రాధిక, శరత్​కుమార్​ దంపతులకు జైలుశిక్ష..!

ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త శరత్​కమార్​ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో వారికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. రాధిక, శరత్​ కుమార్​ నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు కమల్​ హాసన్​ నేతృత్వంలోని మక్కల్​ నీది మయ్యం పార్టీ తో వాళ్లు పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉంటే నిన్నే […]

రాధిక, శరత్​కుమార్​ దంపతులకు జైలుశిక్ష..!
X

ప్రముఖ నటి రాధిక, ఆమె భర్త శరత్​కమార్​ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో వారికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. రాధిక, శరత్​ కుమార్​ నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన విషయం తెలిసిందే.

ప్రముఖ నటుడు కమల్​ హాసన్​ నేతృత్వంలోని మక్కల్​ నీది మయ్యం పార్టీ తో వాళ్లు పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉంటే నిన్నే తమిళనాట ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో సడెన్​గా వీరికి జైలు శిక్ష ఖరారు చేస్తున్నట్టు చెన్నై స్పెషల్​ కోర్టు ప్రకటించింది.

కేసు నేపథ్యం ఇదీ..!
గతంలో రాధిక, శరత్​కుమార్​ దంపతులు లిస్టిన్​ స్టీఫెన్​ అనే వ్యక్తి సంయుక్తంగా సినిమాలు నిర్మించేవాళ్లు. ఈ క్రమంలో రేడియన్స్​ మీడియా ప్రైవేట్​ లిమిటెడ్​ అనే కంపెనీ నుంచి వీళ్లు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారు. అయితే ఆ డబ్బు కోసం సదరు సంస్థ ఒత్తడి చేయగా.. 2017లో వారికి రాధిక, శరత్​ కుమార్​ దంపతులు ఓ చెక్​ రాసి ఇచ్చారు. కానీ ఈ చెక్​ బౌన్స్​ అయ్యింది. దీంతో సదరు కంపెనీ కోర్టును ఆశ్రయించింది.

చాలా కాలంగా ఈ కేసుపై వాదోపవాదాలు సాగాయి. ఇదిలా ఉంటే ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ రాధిక దంపతులకు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ విషయంపై రాధిక దంపతులు పై కోర్టును ఆశ్రయిస్తారా? లేక జైలు శిక్ష అనుభవిస్తారా? అన్న విషయం వేచి చూడాలి.

First Published:  7 April 2021 8:37 AM GMT
Next Story