Telugu Global
NEWS

చరిత్రలో నిలిచిన కాళేశ్వరం.. మేఘా ప్రపంచ రికార్డు..

తక్కువ సమయంలోనే 100 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోయింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఈ అద్భుతాన్ని సాధించింది. నీటి పంపింగ్ లో ప్రపంచ రికార్డు సాధించడమే కాకుండా, మేఘా సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్ లో సీఎం కేసీఆర్ ఆలోచనలకు.. మేఘా సామర్థ్యం తోడవడంతో తెలంగాణ భూములు సస్య శ్యామలంగా మారుతున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా.. తెలంగాణలో నిర్మించిన […]

చరిత్రలో నిలిచిన కాళేశ్వరం.. మేఘా ప్రపంచ రికార్డు..
X

తక్కువ సమయంలోనే 100 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేసి, కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోయింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఈ అద్భుతాన్ని సాధించింది. నీటి పంపింగ్ లో ప్రపంచ రికార్డు సాధించడమే కాకుండా, మేఘా సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్ లో సీఎం కేసీఆర్ ఆలోచనలకు.. మేఘా సామర్థ్యం తోడవడంతో తెలంగాణ భూములు సస్య శ్యామలంగా మారుతున్నాయి.

చరిత్రలో నిలిచిపోయేలా..
తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకం. మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. నేడు నీటి పంపింగ్ విషయంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అనతికాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎత్తిపోస్తోంది.

ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కో కేంద్రం నుంచి 100 టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. లింక్ -1లోని మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం(సరస్వతి), సుందిళ్ల(పార్వతి), లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ(గాయత్రి) పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టిఎంసీల చొప్పున నీటిని పంప్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూ ఊపరితలంపైన అతిపెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్ ను 2019 జూలై 6న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి 522 రోజులపాటు పని చేసి లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 100 టిఎంసీల వరకు నీటిని పంప్ చేశారు. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్ లో 3వ మిషన్ 1110 గంటలపాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటలపాటు పనిచేసింది. కాళేశ్వరంలోని తొలిపంప్ హౌస్ ఇదేకావడం విశేషం. ప్రాణహిత నీటిని గోదావరి నదిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది.

లక్ష్మీ పంప్ హౌస్ ను పార్వతి పంప్ హౌస్ కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజులపాటు నీటిని ఎత్తిపోసింది. 100 టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1347 గంటలపాటు పని చేసింది. అతి తక్కువగా 12వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది. ఇక లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం ఏకంగా 504 రోజులపాటు నీటిని పంప్ చేసి రికార్డు సృష్టించింది. 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. అత్యధికంగా రెండవ మిషన్ 1076 గంటల నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది.

భూగర్భ అద్భుతం.. గాయత్రి పంప్ హౌస్..
లింక్-2 లో భూగర్భంలో ఉన్న అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్ ను 2019 ఆగస్ట్ 11న ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ పంప్ హౌస్ కూడా 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు తరలించారు. ఈ పంప్ హౌస్ లో రెండవ మిషన్ అత్యధికంగా 1703 గంటలపాటు నీటిని పంపింగ్ చేయగా.. మొదటి మిషన్ 1367గంటలపాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని 7 మిషన్లలో ఒక్కో మిషన్ నుంచి 3150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు.

ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా భారీస్థాయిలో పంపుహౌస్‌ లను మేఘా సంస్థ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించింది. రోజుకు గరిష్టంగా 3 టిఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20పంప్ హౌస్‌ ల కింద మొత్తం 104మెషీన్‌లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాలను మేఘా సంస్థ నిర్మించింది.

సబ్ స్టేషన్ నిర్మాణంలోనూ రికార్డు..
ఎత్తిపోతల విషయంలోనే కాదు, కాళేశ్వరంలో భారీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం-ట్రాన్స్‌ మిషన్ లైన్ల ఏర్పాట్లలో సరికొత్త రికార్డ్‌ నెలకొల్పింది మేఘా సంస్థ. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొత్తం 5159 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మేఘా సంస్థ 4439 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తికి తగ్గ పనులు పూర్తి చేసింది. విద్యుత్‌ సరఫరా చేసే 6 సబ్‌ స్టేషన్లు.. వాటి లైన్లను సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు.. మోటార్లను బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్, జైమ్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్ల ఏర్పాటు ఎక్కడా లేదు. లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్ హౌస్‌ లలో ఒక్కొకటి 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్‌-1లోని ఈ మూడు పంపుహౌస్‌ ల కింద 1720 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించే విధంగా పంపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. అన్నారం(సరస్వతి)లో 12 పంపింగ్‌ యూనిట్లు, సుందిళ్ళ(పార్వతి) పంపింగ్‌ కేంద్రంలో 14 యూనిట్లు అనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి.

ప్యాకేజీ 8 లోని భూగర్భ(గాయత్రి) పంపింగ్‌ కేంద్రంలో 7 రోజులకి 2 టీఎంసీలు పంప్ చేసేలా 7 యూనిట్‌లు వినియోగంలోకి తీసుకొచ్చారు. ఒక్కో యూనిట్‌ సామర్ధ్యం 139మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో తప్ప మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వియోగించేలా పంపిగ్‌ సామర్ధ్యం ఉందంటే దాని స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కాళేశ్వరం తర్వాత రంగనాయక సాగర్‌ లోని 4 మెషీన్లను ఒక్కొకటి 135మెగావాట్ల సామర్ధ్యంతో మేఘా సంస్థ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్ ‌హౌస్‌లో నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి. అటు నీటి పంపింగ్ లో, ఇటు విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్ల విషయంలో మేఘా సంస్థ తన సామర్థ్యం నిరూపించుకుంది.

First Published:  16 March 2021 3:29 AM GMT
Next Story