Telugu Global
NEWS

రేవంత్​ మీటింగ్​కు వెళ్లొద్దు..! సీనియర్ల నిర్ణయం..!

కాంగ్రెస్​ మార్కు రాజకీయాలే అంత.. వాళ్లకు ప్రతిపక్షాలే అక్కర్లేదు. సొంతపార్టీలోనే విమర్శలు ఎదురవుతుంటాయి. ఎవరైనా లీడర్​గా ఎదుగుతున్నారంటే.. అదే పార్టీలోని వాళ్లు ఎదగనివ్వరు. పక్క నియోజకవర్గంలో నిలబడ్డ తమ పార్టీ ఎమ్మెల్యేనే ఓడించాలని చూస్తుంటారు. వర్గపోరుకు, గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్​ పెట్టింది పేరు. అందుకే ఇప్పుడు రేవంత్​రెడ్డి ‘పాదయాత్ర’ పై సీనియర్​ కాంగ్రెస్​ నేతలు గుర్రుగా ఉన్నారు. రేపు రావిరాలలో జరిగే రేవంత్​ బహిరంగ సభకు వెళ్లొద్దని కాంగ్రెస్​ సీనియర్లు నిర్ణయం తీసుకున్నారట. ఈ నెల 7న […]

రేవంత్​ మీటింగ్​కు వెళ్లొద్దు..! సీనియర్ల నిర్ణయం..!
X

కాంగ్రెస్​ మార్కు రాజకీయాలే అంత.. వాళ్లకు ప్రతిపక్షాలే అక్కర్లేదు. సొంతపార్టీలోనే విమర్శలు ఎదురవుతుంటాయి. ఎవరైనా లీడర్​గా ఎదుగుతున్నారంటే.. అదే పార్టీలోని వాళ్లు ఎదగనివ్వరు. పక్క నియోజకవర్గంలో నిలబడ్డ తమ పార్టీ ఎమ్మెల్యేనే ఓడించాలని చూస్తుంటారు. వర్గపోరుకు, గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్​ పెట్టింది పేరు. అందుకే ఇప్పుడు రేవంత్​రెడ్డి ‘పాదయాత్ర’ పై సీనియర్​ కాంగ్రెస్​ నేతలు గుర్రుగా ఉన్నారు. రేపు రావిరాలలో జరిగే రేవంత్​ బహిరంగ సభకు వెళ్లొద్దని కాంగ్రెస్​ సీనియర్లు నిర్ణయం తీసుకున్నారట.

ఈ నెల 7న రేవంత్​రెడ్డి .. నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రైతు భరోసా దీక్షను చేపట్టారు. సాయంత్రం వరకు దీక్షలో కూర్చున్న రేవంత్​ అనూహ్యంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దీంతో ఆ రోజు నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. అచ్చంపేట.. కల్వకుర్తి నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో రేవంత్​ పాదయాత్ర సాగింది. ప్రజల నుంచి కూడా స్పందన బాగానే వచ్చింది. అయితే ఈనెల 16న అంటే రేపు రావిరాలలో భారీ బహిరంగసభ ఏర్పాటుచేయాలని రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్​ సహా కీలక నేతలను పిలవాలని ఆయన భావించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్​ సీనియర్ల నుంచి రేవంత్​కు వ్యతిరేకత వస్తున్నది.

అసలు పాదయాత్రకు రేవంత్​రెడ్డి అధిష్ఠానం అనుమతి తీసుకోలేదని సీనియర్లు వాదిస్తున్నారు. కేవలం ఎవరి నియోజవర్గాల్లో వారు పాదయాత్ర చేసుకోవాలని అధిష్ఠానం సూచిస్తే.. రేవంత్​ రెడ్డి మాత్రం తన పార్లమెంట్​ నియోజకవర్గాన్ని దాటి .. మరోచోట పాదయాత్ర చేస్తున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు. నిజానికి అచ్చంపేట రేవంత్​ సొంత నియోజకవర్గమే అయితే ఆ స్థానం ఎస్సీకి రిజర్వ్​ కావడంతో ఆయన మరోచోట పోటీచేస్తున్నారు. కానీ కాంగ్రెస్​ సీనియర్లు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఇదిలా ఉంటే ‘రైతన్నా.. నేటి నా గొంతులో ఆవేదన, రేపటి నీ బతుకులో వాస్తవం.. అందుకే.. రేపటి వరకు వద్దు.. ఈ రోజే చరిత మార్చేద్దాం రా.. తరలిరా.. రావిరాలకు’’.. అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

First Published:  15 Feb 2021 10:11 AM GMT
Next Story