Telugu Global
NEWS

బాలకృష్ణ కీలక నిర్ణయం.. ఇక పూర్తిగా జనం మధ్యే ..!

హిందూపూర్​ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంబడే బాలకృష్ణ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారట. ప్రస్తుతం ఆయన హిందూపూర్​ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో లేరు. ఓవైపు సినీనటుడిగా.. మరోవైపు ఎమ్మెల్యేగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇవాళ బాలకృష్ణ నెల్లూరు నేతలతో ఫోన్​లో మాట్లాడారు. ఈ […]

బాలకృష్ణ కీలక నిర్ణయం.. ఇక పూర్తిగా జనం మధ్యే ..!
X

హిందూపూర్​ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంబడే బాలకృష్ణ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారట. ప్రస్తుతం ఆయన హిందూపూర్​ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో లేరు. ఓవైపు సినీనటుడిగా.. మరోవైపు ఎమ్మెల్యేగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇవాళ బాలకృష్ణ నెల్లూరు నేతలతో ఫోన్​లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో అరాచక పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారట. గతంలో బిహార్​, యూపీలో ఉన్నట్టు ఇప్పుడు రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారట.

నిజానికి బాలకృష్ణ టీడీపీలో ఉన్నా ఆయన కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. పార్టీలోగాని ప్రభుత్వంలోగాని కీలక పదవులు ఎప్పుడూ తీసుకోలేదు. మరోవైపు ఆయన అల్లుడు లోకేశ్​ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీడీపీని బలోపేతం చేయడానికే బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  7 Feb 2021 10:33 AM GMT
Next Story