చాలారోజుల తర్వాత ఏపీలో కనిష్ట స్థాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి తగ్గుతోంది. చాలాకాలం తర్వాత ఐదు వేల కంటే తక్కువ స్థాయికి కేసుల నమోదు పడిపోయింది. సోమవారం 3,224 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆగస్టులో రోజుకు 10వేల వరకు కేసులు నమోదు అయ్యేవి. సెప్టెంబర్ నుంచి కాస్త తగ్గుతూ వస్తున్న కరోనా కేసుల ఉధృతి… ఇప్పుడు మరింత తగ్గింది. రోజువారీగా చూస్తే కరోనా సోకుతున్న వారి కంటే కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఏపీలో […]
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి తగ్గుతోంది. చాలాకాలం తర్వాత ఐదు వేల కంటే తక్కువ స్థాయికి కేసుల నమోదు పడిపోయింది. సోమవారం 3,224 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆగస్టులో రోజుకు 10వేల వరకు కేసులు నమోదు అయ్యేవి.
సెప్టెంబర్ నుంచి కాస్త తగ్గుతూ వస్తున్న కరోనా కేసుల ఉధృతి… ఇప్పుడు మరింత తగ్గింది. రోజువారీగా చూస్తే కరోనా సోకుతున్న వారి కంటే కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 7 లక్షల 58వేల మంది కరోనా బారినపడ్డారు. యాక్టివ్ కేసులు 44వేల వరకు ఉన్నాయి. భారీగా పరీక్షలు నిర్వహిస్తూ ముందుకెళ్లి సెకండ్ వేవ్ రాకుండా అడ్డుకోగలిగితే… త్వరలోనే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. టెస్టులు మాత్రం భారీగానే నిర్వహిస్తున్నారు.