Telugu Global
National

పవర్ స్టేషన్‌ మృతుల కుటుంబాలకు భారీగా ఆర్థిక సాయం పెంపు

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదానికి బలైన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా పరిహారం పెంచింది. ఇది వరకు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాకు అదనంగా ఒక్కొకుటుంబానికి మరో 75 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్టు టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. దీంతో మృతి చెందిన డీఈ కుటుంబానికి కోటి 25 లక్షలు, మిగిలిన ఉద్యోగుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. […]

పవర్ స్టేషన్‌ మృతుల కుటుంబాలకు భారీగా ఆర్థిక సాయం పెంపు
X

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదానికి బలైన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా పరిహారం పెంచింది. ఇది వరకు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాకు అదనంగా ఒక్కొకుటుంబానికి మరో 75 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్టు టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. దీంతో మృతి చెందిన డీఈ కుటుంబానికి కోటి 25 లక్షలు, మిగిలిన ఉద్యోగుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందనుంది. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

తెలంగాణ జెన్ కో బోర్డు సమావేశంలో సీఎండీ ప్రభాకర్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందించాం… భవిష్యత్తులో ఎలాంటి సాయం అందించాలన్న అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా భావించి సాయం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు వివరించారు.

ప్రమాదం జరిగిన వెంటనే మరణించిన డిఇ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇప్పుడు ఈ మొత్తానికి అదనంగా ఒక్కొక్క కుటుంబానికి 75 లక్షల రూపాయలు అందుతుంది.

First Published:  5 Sep 2020 7:50 AM GMT
Next Story