కరోనాతో నంది ఎల్లయ్య మృతి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. నంది ఎల్లయ్య ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. కొద్దిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు.ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. నంది ఎల్లయ్య మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకు కరోనా కరోనా బారిన […]
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. నంది ఎల్లయ్య ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
కొద్దిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు.ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. నంది ఎల్లయ్య మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకు కరోనా
కరోనా బారిన పలువురు రాజకీయ నాయకులుపడుతున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమారులు, వంట మనిషికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. హోం క్వారంటైన్లోనే ఎమ్మెల్యే కుటుంబం ఉంటూ చికిత్స తీసుకుంటోంది.