Telugu Global
National

సాగునీటితో రాళ్ల‌సీమ‌లో ర‌త‌నాల ధార‌లు

ఉమ్మ‌డి ఏపీ నుంచి న‌వ్యాంధ్ర వ‌ర‌కు ముఖ్య‌మంత్రులుగా రాయ‌ల‌సీమ‌కు చెందిన‌వారే ఎక్కువ. కానీ వారెవ‌రూ సీమ ప్ర‌జ‌ల నీటి క‌ష్టాలు ప‌ట్టించుకోలేదు. పక్కనే ఉన్న కృష్ణా జలాలను నిరంతరం కరువు వాత పడుతున్న నాలుగు జిల్లాలకు అందించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించిందే లేదు. డా. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంతో పాటు హంద్రీ-నీవా, గాలేరు నగరి లాంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో […]

సాగునీటితో రాళ్ల‌సీమ‌లో ర‌త‌నాల ధార‌లు
X

ఉమ్మ‌డి ఏపీ నుంచి న‌వ్యాంధ్ర వ‌ర‌కు ముఖ్య‌మంత్రులుగా రాయ‌ల‌సీమ‌కు చెందిన‌వారే ఎక్కువ. కానీ వారెవ‌రూ సీమ ప్ర‌జ‌ల నీటి క‌ష్టాలు ప‌ట్టించుకోలేదు. పక్కనే ఉన్న కృష్ణా జలాలను నిరంతరం కరువు వాత పడుతున్న నాలుగు జిల్లాలకు అందించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించిందే లేదు.

డా. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంతో పాటు హంద్రీ-నీవా, గాలేరు నగరి లాంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు.

ఇప్పుడు రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు తోడ్పడే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపడుతున్నారు. అంతరాష్ర్ట వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చకచకా చేరుకుంది.

ముఖ్యమంత్రి ముందు చూపు – ఏపి చరిత్రలోనే అరుదైన ప్రాజెక్ట్

రాయలసీమలోనే కాదు రాష్ర్టంలోనే ఇంతపెద్ద ఎత్తపోతల పథకం నిర్మించనే లేదు. ఇప్పటి వరకు తెలంగాణలో ప్రపంచంలోనే పెద్దదైన బహుళ, భారీ ఎత్తిపోతల పథకం 2 టిఎంసీల పంపింగ్ సామర్థ్యంతో నిర్మించి ఇప్పుడు మరో టిఎంసి సామర్థ్యం విస్తరిస్తుండగా (కాళేశ్వరం పూర్తిస్థాయిలో నిర్మిస్తే రోజుకు 3 టిఎంసీలు పంప్ చేస్తారు) ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న రాయలసీమ పథకం కూడా అంతే సామర్థ్యంతో చేపడుతున్నారు.

రోజుకు 3 టిఎంసీల నీటిని పంపింగ్ చేయడమంటే అసాధారణమైనది. ఇంతవరకు రాష్ర్టంలో ఇంత పెద్ద పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మించనే లేదు. ఏపీలో అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం మొత్తం ఏడాది పంపింగ్ సామర్థ్యం 40 టిఎంసీలు మాత్రమే.

అదే విధంగా పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నం లాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు.

ఇంత వరకు ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆయనకు వచ్చిందే తడవుగా శాస్ర్త, సాంకేతిక సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేయించాక పని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడమే కాకుండా, శతాబ్దాలుగా కరువువాత పడుతున్న వారిని శాశ్వతంగా ఆదుకునేందుకు సాధ్యమవుతుంది.

కృష్ణ లో నీళ్లున్నా సీమలో కన్నీళ్లు

రాయలసీమలో ఓ వైపున కృష్ణా నది మరోవైపున తుంగభద్రతో పాటు వాటికి ఆనుకుని కర్నాటక నుంచి నెల్లూరు వరకు సీమ మీదుగా పెన్నా నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఎప్పుడూ తాగు, సాగు నీటికి కటకటే.

స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన కెసి కాలువు ద్వారా నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల ఆయకట్టు కుదించుకు పోయింది. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ద్వారా కేటాయించిన నీటిలో సగం వాటా కూడా అందని పరిస్థితుల్లో తుంగభద్ర పొంగి ప్రవహించినప్పటికీ ఆయకట్టుకు సరిగ్గా నీరు అందదు.

శ్రీశైలం నుంచి 1990 దశకంలో ఎస్.ఆర్.బి.సి, తెలుగు గంగ లాంటి ప్రాజెక్ట్ లు చేపట్టారు. ఆ తర్వాత హంద్రీ-నీవా, ముచ్చుమర్రి లతో పాటు శ్రీశైలం నీరు కెసి కాలువకు అందించడం లాంటి పథకాలు పూర్తయ్యాయి. తుంగభద్ర ఎగువ కాలువ కింద పిఎబిఆర్ తో పాటు చిత్రావతి లాంటి జలాశయాలు పూర్తయినప్పటికీ రాయలసీమ దశ-దిశలో ఏమాత్రం మార్పు రాలేదు. కరువు తాండవిస్తూనే ఉంది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి వినియోగం పెంచేందుకు వైయస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది.

వృధాగావరద నీళ్లు – సీమ రైతుకు క‌న్నీళ్లు

శ్రీశైలం నుంచి రాయలసీమకు తెలుగు గంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపిహెచ్ ఎల్ సి (10), తాగు నీటి అవసరాలు- ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి. ఇందుకోసం శ్రీశైలం జలాశయం వెనుకబాగంలో అప్రోచ్ కాలువను నిర్మించి అక్కడి నుంచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరి ద్వారా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసి) ద్వారా జలాశయంలో 841 అడుగుల పైన నీరు చేరిన తరువాత విడుదల చేయాలి.

ఎస్ఆర్ఎంసి నుంచి నీరు బంకిచెర్లా క్రాస్ రెగ్యులేటరీ ద్వారా తెలుగు గంగ (ఎడమవైపు), కెసి కాలువ (మధ్యలో), ఎస్.ఆర్.బి.సి (కుడివైపు)కాలువలకు నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,246 క్యుమెక్స్ లేదా 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే విధంగా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. అంతకు ముందుతో పోలిస్తే దీని సామర్థ్యం పెంచిన తరువాత సీమలో శ్రీశైలం వరద జలాల వినియోగం గణనీయంగా పెరిగింది.

అందుకు గత సంవత్సరం 179.30 టిఎంసీల నీటిని రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నై నగరాలకు మళ్లించారు. అయినప్పటికీ సీమలో నీటి సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు వరదల సమయంలో నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది.

సీమకు ప్రయోజనం లేని వరదలు

మొత్తం 16 ఏళ్ళ పాటు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే 2018-19, 2019-20 సంవత్సరాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని సంవత్సరాలు లభించాల్సిన నీటి కన్నా తక్కువ నీరు అందింది. ఆఖరికి క్రిష్ణాకు భారీ వరదలు వచ్చి శ్రీశైలం పొంగిప్రవహించి జలాలు సముద్రంపాలు అయినప్పటికీ రాయలసీమ వాసులకు మాత్రం ప్రయోజనం లేకపోయింది.

2019-20 సంవత్సరంలో శ్రీశైలంకు 6 విడతల్లో (స్పెల్స్) వరదలు వచ్చాయి. 889 టిఎంసిల నీటిని స్పిల్ వే నుంచి కిందకు విడుదల చేశారు. అందులో 600 టిఎంసిల నీరు నిరుపయోగంగా సముద్రం పాలు అయ్యింది. అదే సమయంలో రాయలసీమలోని 4 జిల్లాలకు అవసరమైన నీరు అందలేదు. 120 టిఎంసిల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఈ నాలుగు జిల్లాలోనూ ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలంచారు.

సీమ వ‌ర‌దాయిని – జ‌లభాగ్య ప్ర‌దాయిని‌

సీమ ప్ర‌జ‌ల జీవితాల్లో జ‌ల వెలుగులు నింపే వ‌ర‌దాయినిగా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఉండ‌బోతోంది. రాళ్ల సీమ‌లో ర‌త‌నాల ధార‌లు పొంగే జ‌ల‌భాగ్య ప్రధాయినిగా చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది. ఆ వివ‌రాలు చూద్దాం…

రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఐపి – రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు 3 టిఎంసిల (34,722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి క్రిష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు.

జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

పంప్ చేసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఆ తరువాత డెలివరీ సిస్ర్టన్ నుంచి నీరు విడుదలై 22 కిలోమీటర్ల మేర ప్రవహించి పోతిరెడ్డిపాడుకు సమీపంలో 4-5 కిలోమీటర్ల మద్య ఎస్ఆర్ఎంసిలో కలుస్తుంది. అక్కడి నుంచి నీరు తెలుగు గంగ, ఎస్.ఆర్.బి.సి, కెసి కాలువలకు సరఫరా అవుతుంది.

ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యూసెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి.

మొత్తం 397 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ర్టంలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఏపిలో ఇదే అరుదైనది, పెద్దది అవుతుంది.

ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే కనీస నీటిమట్టం 243 ఉండాలి. డెలివరీ లెవల్ 273 వద్ద ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12 వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు.

First Published:  24 July 2020 12:18 AM GMT
Next Story