Telugu Global
NEWS

వైసీపీలోకి గంటా !

గంటా వైసీపీలో చేరుతారని చాలా కాలంగా పదేపదే ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి గంటా వైసీపీలో చేరికపై ప్రచారం జరుగుతోంది. టీడీపీ అనుకూల మీడియా సంస్థే ఈ విషయాన్ని చెబుతోంది. ఆగస్ట్ 15న గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరుతారని టీడీపీ మీడియా చెబుతోంది. ఇప్పటికే జగన్‌మోహన్ రెడ్డి సన్నిహితులతో గంటా చర్చలు ముగిశాయని… సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీడీపీ చానళ్లు చెబుతున్నాయి. అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నా … జగన్మోహన్ రెడ్డి మాత్రం గ్రీన్ […]

వైసీపీలోకి గంటా !
X

గంటా వైసీపీలో చేరుతారని చాలా కాలంగా పదేపదే ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి గంటా వైసీపీలో చేరికపై ప్రచారం జరుగుతోంది. టీడీపీ అనుకూల మీడియా సంస్థే ఈ విషయాన్ని చెబుతోంది.

ఆగస్ట్ 15న గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరుతారని టీడీపీ మీడియా చెబుతోంది. ఇప్పటికే జగన్‌మోహన్ రెడ్డి సన్నిహితులతో గంటా చర్చలు ముగిశాయని… సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టీడీపీ చానళ్లు చెబుతున్నాయి.

అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నా … జగన్మోహన్ రెడ్డి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టీడీపీ చానల్ చెబుతోంది. గంటా మంత్రిగా ఉన్నప్పుడు సైకిళ్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంటాను వైసీపీ నేరుగా చేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. తటస్థ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ చానళ్లు చెబుతున్నట్లు గంటా వైసీపీలో చేరితే కేసుల పేరుతో బెదిరించి పార్టీలో చేర్చుకున్నారని టీడీపీ ఎదురుదాడి చేయవచ్చు.

First Published:  23 July 2020 7:54 AM GMT
Next Story