Telugu Global
National

99TV నిధులు ఏమయ్యాయి? సొంత కార్యకర్తలకే సీపీఐ నేతలు టోపి పెట్టారా?

నిత్యం కార్మికుల హక్కులు, మానవత్వం, నిజాయితీ, విలువలు వంటి వాటిపై స్పీచ్‌లు ఇచ్చే సీపీఐ నేతలకు 99టీవీ వ్యవహారం మాయనిమచ్చగా మారుతోంది. కమ్యూనిస్టు భావజాలం వ్యాప్తి చేసేందుకు ఒక చానల్ ఉండాలంటూ కొన్ని ఏళ్ల క్రితం సీపీఐ… 99టీవీని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల సీపీఐ నాయకులు ఇందులో కీలక పాత్ర పోషించారు. చానల్‌కు అవసరమైన నిధులను పార్టీ అనుబంధ సంఘాలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల నుంచి వసూలు చేశారు. పార్టీ పెద్దల మాటలు నమ్మి శ్రేణులు […]

99TV నిధులు ఏమయ్యాయి? సొంత కార్యకర్తలకే సీపీఐ నేతలు టోపి పెట్టారా?
X

నిత్యం కార్మికుల హక్కులు, మానవత్వం, నిజాయితీ, విలువలు వంటి వాటిపై స్పీచ్‌లు ఇచ్చే సీపీఐ నేతలకు 99టీవీ వ్యవహారం మాయనిమచ్చగా మారుతోంది. కమ్యూనిస్టు భావజాలం వ్యాప్తి చేసేందుకు ఒక చానల్ ఉండాలంటూ కొన్ని ఏళ్ల క్రితం సీపీఐ… 99టీవీని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల సీపీఐ నాయకులు ఇందులో కీలక పాత్ర పోషించారు.

చానల్‌కు అవసరమైన నిధులను పార్టీ అనుబంధ సంఘాలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల నుంచి వసూలు చేశారు. పార్టీ పెద్దల మాటలు నమ్మి శ్రేణులు కోట్ల రూపాయలు పోగేసి పెట్టుబడి పెట్టాయి. మూడేళ్లలో డబ్బులు తిరిగి ఇస్తామని సీపీఐ నాయకులు నమ్మించడంతో చాలా మంది ఇలా పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పటికీ వారికి ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు. కోట్లాది రూపాయలు ఏమయ్యాయో ఏ సీపీఐ నాయకుడు కూడా చెప్పడం లేదు.

పార్టీ శ్రేణుల నుంచి కోట్లు వసూలు చేసి ఏర్పాటు చేసిన 99టీవీలో పెత్తనం అంతా ఒక సీపీఐ అగ్ర నాయకుని సతీమణి , మరో అగ్రనాయకుని కూతురు, మరో అగ్ర నాయకుని సతీమణి చెలాయించారు. ఇంత చేసి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేసే సిద్ధాంతానికైనా కట్టుబడ్డారా అంటే అదీ లేదు. కోట్లు సొంతం చేసుకునేందుకు 99 టీవీని జనసేన పార్టీ నాయకుడికి ఆ మధ్య అమ్మేశారు.

ఏమాత్రం విలువలు ఉన్నా, నిజాయితీ ఉన్నా… కనీసం చానల్‌ అమ్మేసిన తర్వాతైనా ఆ డబ్బును తిరిగి పెట్టుబడి దారులకు చెల్లించాలి. కానీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టిన వారికి తిరిగి చెల్లించలేదు. కోట్లాది రూపాయలు ఏమయ్యాయో చెప్పే నాథుడే లేడు.

నిత్యం నీతిసూక్తులు చెప్పే సీపీఐ నారాయణ, రామకృష్ణలు 99టీవీ నిధులు ఏమయ్యాయి అంటే మాత్రం సమాధానం చెప్పరు. కానీ నీతిగా బతకాలి అంటూ ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, సంస్థలకు ఈ నేతలు నిత్యం సూక్తులు చెబుతూ… నిప్పుకు కజిన్స్‌ లెక్క మాట్లాడుతుంటారు. పాపం కమ్యూనిస్టు నేతలే కమ్యూనిస్టు శ్రేణులను మోసం చేయడం ఏపీలో తప్ప మరో చోట సాధ్యం కాకపోవచ్చు.

First Published:  22 July 2020 11:44 PM GMT
Next Story