Telugu Global
NEWS

మంత్రులుగా చెల్లుబోయిన, సిదిరి ప్రమాణస్వీకారం

మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికవడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుతో భర్తీ చేశారు. వీరిద్దరూ మంత్రులుగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. కరోనా కారణంగా తక్కువ మంది ముఖ్యులతోనే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. సిదిరి అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ చేత గవర్నర్ బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, స్పీకర్‌, సీఎస్‌, డీజీపీ, ఇతర మంత్రులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి […]

మంత్రులుగా చెల్లుబోయిన, సిదిరి ప్రమాణస్వీకారం
X

మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికవడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుతో భర్తీ చేశారు.

వీరిద్దరూ మంత్రులుగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. కరోనా కారణంగా తక్కువ మంది ముఖ్యులతోనే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. సిదిరి అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ చేత గవర్నర్ బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, స్పీకర్‌, సీఎస్‌, డీజీపీ, ఇతర మంత్రులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు కాసేపు గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

First Published:  22 July 2020 2:59 AM GMT
Next Story