Telugu Global
National

సుజనా బీజేపీలో పెద్ద తలకాయ... అందుకే నిమ్మగడ్డ చర్చించారు... తప్పేంటి?

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను మరోసారి టీడీపీ వెనుకేసుకొచ్చింది. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ  రమేష్ లు పార్క్ హయత్‌ హోటల్‌లో రహస్య భేటీపై విమర్శలు వస్తుండడంతో వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీ జరిగితే తప్పేంటని ప్రశ్నించారు. భేటీ జరిగిన 13 వ తేదీన నిమ్మగడ్డ ఏమీ ఈసీగా లేరు కదా అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ సీసీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందో కూడా రామయ్య చెప్పారు. పోలీసులు వచ్చి సీసీ […]

సుజనా బీజేపీలో పెద్ద తలకాయ... అందుకే నిమ్మగడ్డ చర్చించారు... తప్పేంటి?
X

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను మరోసారి టీడీపీ వెనుకేసుకొచ్చింది. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్ లు పార్క్ హయత్‌ హోటల్‌లో రహస్య భేటీపై విమర్శలు వస్తుండడంతో వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీ జరిగితే తప్పేంటని ప్రశ్నించారు. భేటీ జరిగిన 13 వ తేదీన నిమ్మగడ్డ ఏమీ ఈసీగా లేరు కదా అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

ఈ సీసీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందో కూడా రామయ్య చెప్పారు. పోలీసులు వచ్చి సీసీ ఫుటేజ్‌ను తీసుకెళ్లారని… కానీ దాన్ని సాక్షి టీవీకి మాత్రమే ఎందుకు ఇచ్చారని నిలదీశారు. నిజానికి ఈ దృశ్యాలను సాక్షి కంటే ముందే మరొక టీవీ చానల్ ప్రసారం చేసింది.

ప్రస్తుతం బీజేపీలో సుజనాచౌదరి ఒక పెద్ద తలలా ఉన్నారని… అందుకే ఏపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని వివరించేందుకు సుజనాచౌదరిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసి ఉంటారని వర్ల రామయ్య విశ్లేషించారు.

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏపీలో రాజ్యాంగ వ్యవస్థను రక్షించాల్సిందిగా సుజనాచౌదరిని కోరేందుకే ఈ భేటీ జరిగి ఉంటుందన్నారు వర్లరామయ్య. ఆ ముగ్గురు ఏమైనా అరాచక శక్తులా అని ప్రశ్నించారు. హోటల్‌లో ముగ్గురు చర్చించారని… వైసీపీ ప్రభుత్వ పోకడలపైనే చర్చించారని వర్ల రామయ్య చెప్పారు.

First Published:  23 Jun 2020 9:46 AM GMT
Next Story