Telugu Global
National

డాక్టర్ల వివాదం వెనుక.... భారీ స్కెచ్‌ ఉందా?

విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌, చిత్తూరులో అనితారాణి. ఇద్దరూ డాక్టర్లే. ఒకే సామాజికవర్గం . వైజాగ్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌లు ముగిసిన వెంటనే… అదే తరహాలో అనితారాణి వ్యవహారం తెరపైకి వచ్చింది. నారా లోకేష్‌ ఆమె వీడియోను ట్వీట్‌ చేశారు. ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే టీడీపీ నేతలు కావాలనే రాజకీయంగా స్కెచ్‌లు గీస్తున్నారనే అర్ధమవుతోంది. ఈ ఇద్దరు డాక్టర్లదీ ఒకే సామాజికవర్గం. వీరి కుటుంబాలలో రాజకీయంగా ఎదగాలనే కోరికలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పాయకరావుపేట సీటు కోసం డాక్టర్‌ […]

డాక్టర్ల  వివాదం వెనుక.... భారీ స్కెచ్‌ ఉందా?
X

విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌, చిత్తూరులో అనితారాణి. ఇద్దరూ డాక్టర్లే. ఒకే సామాజికవర్గం . వైజాగ్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌లు ముగిసిన వెంటనే… అదే తరహాలో అనితారాణి వ్యవహారం తెరపైకి వచ్చింది. నారా లోకేష్‌ ఆమె వీడియోను ట్వీట్‌ చేశారు. ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే టీడీపీ నేతలు కావాలనే రాజకీయంగా స్కెచ్‌లు గీస్తున్నారనే అర్ధమవుతోంది.

ఈ ఇద్దరు డాక్టర్లదీ ఒకే సామాజికవర్గం. వీరి కుటుంబాలలో రాజకీయంగా ఎదగాలనే కోరికలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పాయకరావుపేట సీటు కోసం డాక్టర్‌ సుధాకర్‌ ప్రయత్నాలు చేశారు. ఇదే టైమ్‌లో అనితారాణి రాజకీయ ఉద్దేశాలు ఇంకా బయటపడలేదు. కానీ ఆమె కూడా చిత్తూరు జిల్లాలో ఓ రిజర్వ్‌డ్‌ సీటుపై కన్నేసినట్లు సమాచారం.

టీడీపీ మొదటి నుంచి బీసీ ఓటు బ్యాంక్‌పై ఆధారపడి అధికారంలోకి వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్‌ దూరం జరిగింది. దీంతో తిరిగి ఆ ఓటుబ్యాంక్ వచ్చే సూచనలు కనిపించడంలేదు. దీంతో వైసీపీకి పునాదిగా ఉన్న ఎస్సీ ఓటు బ్యాంక్‌ ను దూరం చేయాలని టీడీపీ పెద్దలు ప్లాన్‌ వేశారు. అందులో భాగంగా ఈ డాక్టర్ల ఎపిసోడ్‌లను పెద్దవి చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ? దళితులు సరైన దుస్తులు ధరించరు… శుభ్రంగా ఉండరు…. అంటూ అధికారంలో ఉన్నన్నాళ్ళూ టీడీపీ అధినేత నుంచి పార్టీ నేతల వరకూ ఇలాంటి స్టేట్ మెంట్ లు ఇచ్చారు. దీంతో ఆ సామాజికవర్గం పూర్తిగా టీడీపీకి దూరమైంది. ఇప్పుడు అక్కడ పట్టుకోసం ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అయితే ఈ సంఘటనలు నాలుగు రోజులు మీడియాలో నానుతాయి. ఆతర్వాత జనం మర్చిపోతారు. వర్ల రామయ్య లాంటి నేతను కరివేపాకులా వాడుకుంటున్నారు. ఇక ఆ పార్టీలో దళితులకు పెద్దపీట వేస్తారంటే జనం ఎలా నమ్ముతారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అయితే వివాదాలతో జనం ఓట్లేయరని… వివిధ కార్యక్రమాల ద్వారా వారి దగ్గరకు వెళితేనే జనం నమ్ముతారనే విషయం గుర్తుంచుకోవాలనేది మరికొందరి టీడీపీ నేతల వాదన.

మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో పోయిన ఓటు బ్యాంక్‌ కోసం టీడీపీ ఇలా ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

First Published:  10 Jun 2020 4:18 AM GMT
Next Story