Telugu Global
NEWS

జగన్‌, మోడీ కలిసి పనిచేస్తున్నారు " రామ్‌మాధవ్‌

జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏపీలోని పరిస్థితులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్ స్పందించారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్‌మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం వైఎస్‌ జగన్ ధృడ సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. అక్కడక్కడా కొన్ని వివాదాలున్నా అవేం పెద్దవి కాదని వ్యాఖ్యానించారు. అన్నిటికీ ముఖ్యమంత్రిని తప్పుబట్టడం సరికాదన్నారు. దేవాదాయ ఆస్తుల విషయంలో సాధుసంతువుల కమిటీ ద్వారా.. నిర్ణయం తీసుకుంటామని సీఎం నిర్ణయించడం […]

జగన్‌, మోడీ కలిసి పనిచేస్తున్నారు  రామ్‌మాధవ్‌
X

జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏపీలోని పరిస్థితులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్ స్పందించారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్‌మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం వైఎస్‌ జగన్ ధృడ సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. అక్కడక్కడా కొన్ని వివాదాలున్నా అవేం పెద్దవి కాదని వ్యాఖ్యానించారు. అన్నిటికీ ముఖ్యమంత్రిని తప్పుబట్టడం సరికాదన్నారు. దేవాదాయ ఆస్తుల విషయంలో సాధుసంతువుల కమిటీ ద్వారా.. నిర్ణయం తీసుకుంటామని సీఎం నిర్ణయించడం సంతోషకరమని స్వాగతించారు.

పార్లమెంట్‌లో వైసీపీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి మంచి మద్దతు లభిస్తోందని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు.. వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేవని స్పష్టం చేశారు. ప్రజల కోసం మోడీ, జగన్‌ కలిసి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు, ఇతర అంశాలపై ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీయే చెప్పారని రామ్‌మాధవ్‌ గుర్తు చేశారు. విభజన తర్వాత ఏపీ తక్కువ వనరులతో అవతరించిందని… అందుకే 15వ ఆర్థిక సంఘం సైతం నూతనంగా ఏర్పడిన ఏపీని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని ఆర్థిక సంఘం ఆలోచన చేసిందని ఆయన పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఏపీకి చెందినవాడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు సహకారం కూడా అందిస్తానని ఏపీ ప్రభుత్వానికి రామ్‌ మాధవ్ చెప్పారు.

బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి… జాతీయ స్థాయి నాయకుల వైఖరే ముఖ్యం. అదే కొలమానంగా చూడాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఏకైన బీజేపీ జాతీయ అధికారప్రతినిధిగా ఉన్న జీవీఎల్ నరసింహారావు కూడా చాలా విషయాలలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఇలా కీలకవ్యాఖ్యలు చేశారు.

First Published:  29 May 2020 11:52 PM GMT
Next Story