Telugu Global
NEWS

ఒళ్లు దగ్గరపెట్టుకోండి... అన్నీ నోట్ చేసుకుంటున్నా- వైసీపీ సోషల్ మీడియాకు యరపతినేని వార్నింగ్‌

వైసీపీ సోషల్ మీడియాకు టీడీపీ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారికి వార్నింగ్‌ ఇస్తూ ఒక వీడియోను యరపతినేని విడుదల చేశారు. వైసీపీ నెటిజన్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. విర్రవీగే వైసీపీ వారికి తాము తిరిగి అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. ”వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్‌ ఇష్టానుసారం టీడీపీపైనా, టీడీపీ నేతలపైనా పోస్టుపెడుతోంది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గుర్తు […]

ఒళ్లు దగ్గరపెట్టుకోండి... అన్నీ నోట్ చేసుకుంటున్నా- వైసీపీ సోషల్ మీడియాకు యరపతినేని వార్నింగ్‌
X

వైసీపీ సోషల్ మీడియాకు టీడీపీ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారికి వార్నింగ్‌ ఇస్తూ ఒక వీడియోను యరపతినేని విడుదల చేశారు.

వైసీపీ నెటిజన్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. విర్రవీగే వైసీపీ వారికి తాము తిరిగి అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు.

”వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్‌ ఇష్టానుసారం టీడీపీపైనా, టీడీపీ నేతలపైనా పోస్టుపెడుతోంది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి. అధికారం ఉందని విర్రవీగితే అధికారం పోయిన తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. విర్రవీగుతూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్న వారి పేర్లను, గోత్రాలను, చిరునామాలను డైరీలో రాసుకుంటున్నా.

చరిత్రలో మీకు ఎలాంటి ముగింపు ఉంటుందో చూస్తారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిది. మీ ప్రభుత్వం పని అయిపోయింది. ఏడాదిలోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ కుప్పకూలిపోతుంది. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్త వ్యవహరించాల్సిందిగా వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌ను హెచ్చరిస్తున్నా” అంటూ యరపతినేని శ్రీనివాస్ ఒక వీడియోను విడుదల చేశారు.

First Published:  21 May 2020 8:29 PM GMT
Next Story