Telugu Global
Cinema & Entertainment

ప్రజల్ని హెచ్చరిస్తున్న దర్శకురాలు

సినీ జనాల్ని, మధ్యతరగతి ప్రజల్ని దర్శకురాలు నందినీరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టేస్తోందని, అంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. చాలామందికి ఈ విషయం అర్థంకావడం లేదని, మరో 2-3 నెలల్లో భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతున్నామని అంటున్నారు. ఇప్పట్నుంచే ఖర్చులు తగ్గించుకోవాలని, అత్యవసరాల కోసం కొంత డబ్బును జేబులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన నందినీ రెడ్డి.. ఈ లాక్ డౌన్ వల్ల వాకింగ్, స్విమ్మింగ్ ను బాగా మిస్సవుతున్నట్టు తెలిపారు. […]

ప్రజల్ని హెచ్చరిస్తున్న దర్శకురాలు
X

సినీ జనాల్ని, మధ్యతరగతి ప్రజల్ని దర్శకురాలు నందినీరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టేస్తోందని, అంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. చాలామందికి ఈ విషయం అర్థంకావడం లేదని, మరో 2-3 నెలల్లో భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతున్నామని అంటున్నారు. ఇప్పట్నుంచే ఖర్చులు తగ్గించుకోవాలని, అత్యవసరాల కోసం కొంత డబ్బును జేబులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైన నందినీ రెడ్డి.. ఈ లాక్ డౌన్ వల్ల వాకింగ్, స్విమ్మింగ్ ను బాగా మిస్సవుతున్నట్టు తెలిపారు. నందినీరెడ్డి ఇంటికి పక్కనే చిన్న పార్క్ ఉంటుంది. రోజూ ఆ పార్క్ లో ఆమె వాకింగ్ చేస్తారు. లాక్ డౌన్ వల్ల ఆ పార్క్ మూతపడింది. ఇక వాకింగ్ చేసిన వెంటనే స్విమ్మింగ్ చేయడం ఆమెకు ఇష్టం. ఈ లాక్ డౌన్ వల్ల అది కూడా కుదరడం లేదని అంటున్నారు ఈ డైరక్టర్. ఈ లాక్ డౌన్ వల్ల ఆ రెండింటిని బాగా మిస్సవుతున్నానని బాధపడ్డారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. సమంతతో తను సినిమా చేయబోతున్నాననే విషయంలో నిజం లేదని మరోసారి స్పష్టంచేసిన ఈ దర్శకురాలు.. ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ పై చేయబోయే మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేస్తున్నట్టు తెలిపారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో ఫన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

First Published:  16 May 2020 8:35 PM GMT
Next Story