Telugu Global
NEWS

గ్రామాల్లో బస చేసిన మంత్రులు, విజయసాయిరెడ్డి

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ఏపీ మంత్రులు రాత్రి బస చేశారు. అక్కడే భోజనాలు చేశారు. స్థానికులతో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. అనంతరం రాత్రి అక్కడే బస చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయా గ్రామాల్లో బస చేశారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రభావిత గ్రామాల్లో రాత్రి బస చేశారు. అరుబయట విజయసాయిరెడ్డి నిద్రించారు. ప్రభావిత గ్రామ […]

గ్రామాల్లో బస చేసిన మంత్రులు, విజయసాయిరెడ్డి
X

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ఏపీ మంత్రులు రాత్రి బస చేశారు. అక్కడే భోజనాలు చేశారు. స్థానికులతో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. అనంతరం రాత్రి అక్కడే బస చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయా గ్రామాల్లో బస చేశారు.

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రభావిత గ్రామాల్లో రాత్రి బస చేశారు. అరుబయట విజయసాయిరెడ్డి నిద్రించారు.

ప్రభావిత గ్రామ ప్రజలకు ప్రభుత్వమే భోజనం అందజేసింది. వెజ్‌తో పాటు నాన్ వెజ్‌ వంటకాలను కూడా ఐదు గ్రామాల ప్రజలకు అందించారు. ప్రజలతో కలిసి మంత్రులు, ఎంపీలు భోజనం చేశారు.

First Published:  11 May 2020 9:21 PM GMT
Next Story