Telugu Global
Cinema & Entertainment

వెండితెరపైకి మరో పీరియాడిక్ మూవీ

టాలీవుడ్ లో ఈమధ్య పీరియాడిక్ మూవీ కల్చర్ బాగా పెరిగింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ మూవీ కూడా పీరియాడిక్ మూవీనే. ఇప్పుడీ కోవలో మరో మూవీ రాబోతోంది. ఫస్ట్ టైమ్ ఈ జానర్ లోకి ఎంటర్ కాబోతున్నాడు హీరో శర్వానంద్. చందు మొండేటి, శర్వానంద్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతోంది. 1910లో ప్రారంభమై 2021 వరకు నడిచే పీరియాడిక్ ప్రేమకథతో ఓ సినిమా చేయబోతున్నాడు శర్వానంద్. మూడు దశల్లో సాగే ఈ ప్రేమకథలో […]

వెండితెరపైకి మరో పీరియాడిక్ మూవీ
X

టాలీవుడ్ లో ఈమధ్య పీరియాడిక్ మూవీ కల్చర్ బాగా పెరిగింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ మూవీ కూడా పీరియాడిక్ మూవీనే. ఇప్పుడీ కోవలో మరో మూవీ రాబోతోంది. ఫస్ట్ టైమ్ ఈ జానర్ లోకి ఎంటర్ కాబోతున్నాడు హీరో శర్వానంద్. చందు మొండేటి, శర్వానంద్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతోంది.

1910లో ప్రారంభమై 2021 వరకు నడిచే పీరియాడిక్ ప్రేమకథతో ఓ సినిమా చేయబోతున్నాడు శర్వానంద్. మూడు దశల్లో సాగే ఈ ప్రేమకథలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. మనం సినిమా టైపులో అందరికీ గుర్తుండిపోయే ప్రేమకథగా ఇది రాబోతోందంటున్నాడు దర్శకుడు చందు.

నిజానికి ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ జాను టైమ్ లో శర్వానంద్ గాయపడ్డాడు. దీంతో జాను లేట్ అయింది. ఆ సినిమా తర్వాత లెక్కప్రకారం శ్రీకారం చేయాలి. ఈ గ్యాప్ లో లాక్ డౌన్ పడింది. అందుకే ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది.

దీంతో కార్తికేయ-2 స్టార్ట్ చేశాడు దర్శకుడు చందు మొండేటి. ఇటు కార్తికేయ-2, అటు శ్రీకారం సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే ఈ పీరియాడిక్ ప్రేమకథ సెట్స్ పైకి వస్తుంది.

First Published:  6 May 2020 8:21 PM GMT
Next Story