Telugu Global
National

ఎక్కడి వారు అక్కడే ఉండండి " ఏపీ ప్రభుత్వం

పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలని సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవొద్దని సూచించింది. కేవలం వలస కూలీలను మాత్రమే తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని… మిగిలిన వారు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి … చాలా మంది రాష్ట్రంలోకి వచ్చేందుకు సరిహద్దుల వద్దకు వస్తున్నారన్న […]

ఎక్కడి వారు అక్కడే ఉండండి  ఏపీ ప్రభుత్వం
X

పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలని సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవొద్దని సూచించింది. కేవలం వలస కూలీలను మాత్రమే తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని… మిగిలిన వారు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి … చాలా మంది రాష్ట్రంలోకి వచ్చేందుకు సరిహద్దుల వద్దకు వస్తున్నారన్న సమాచారంపై స్పందించారు. వలస కూలీలను మాత్రమే అనుమతిస్తున్నామని… వారిని కూడా వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచుతున్నామని ప్రభుత్వం వివరించింది.

ఇతరులు రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించి ఇబ్బంది పడవద్దని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయాణాల వల్ల వైరస్‌ పెరిగే అవకాశం ఉందని… సొంత కుటుంబసభ్యులకే ఇబ్బంది కలిగించిన వారవుతారని ప్రభుత్వం అభిప్రాయపడింది. కాబట్టి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రభుత్వం కోరింది.

First Published:  3 May 2020 4:02 AM GMT
Next Story