Telugu Global
Cinema & Entertainment

ఆ రెండు సినిమాలూ చేస్తాను

గీతగోవిందం తర్వాత పరశురామ్ ఎవరితో సినిమా చేస్తాడనే అంశంపై చాలా డ్రామా నడిచింది. ఎంతోమంది హీరోల్ని సంప్రదించి, చివరికి నాగచైతన్యతో సినిమా లాక్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ప్రాజెక్టును కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే అంతలోనే మహేష్ నుంచి పిలుపురావడం, పరశురామ్ అటు షిప్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. నాగచైతన్యతో సినిమా ఎనౌన్స్ చేసి, మహేష్ వైపు షిఫ్ట్ అవ్వడం ఏంటని గట్టిగా ప్రశ్నించారు. […]

ఆ రెండు సినిమాలూ చేస్తాను
X

గీతగోవిందం తర్వాత పరశురామ్ ఎవరితో సినిమా చేస్తాడనే అంశంపై చాలా డ్రామా నడిచింది. ఎంతోమంది హీరోల్ని సంప్రదించి, చివరికి నాగచైతన్యతో సినిమా లాక్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ప్రాజెక్టును కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే అంతలోనే మహేష్ నుంచి పిలుపురావడం, పరశురామ్ అటు షిప్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. నాగచైతన్యతో సినిమా ఎనౌన్స్ చేసి, మహేష్ వైపు షిఫ్ట్ అవ్వడం ఏంటని గట్టిగా ప్రశ్నించారు. తనపై కొన్ని రోజులుగా జరుగుతున్న ట్రోలింగ్ పై ఎట్టకేలకు స్పందించాడు పరశురామ్. నాగచైతన్యతో చేయాల్సిన సినిమాను తను వదులుకోలేదని స్పష్టంచేశాడు. కాకపోతే ఆలస్యం అవుతుందని అంటున్నాడు.

నాగచైతన్య హీరోగా నాగేశ్వరరావు అనే ప్రాజెక్ట్ అనుకున్నాడు పరశురామ్. అయితే మహేష్ మూవీ వల్ల అది లేట్ అవుతుందని, మహేష్ తో మూవీ కంప్లీట్ చేసిన వెంటనే నాగచైతన్యతో సినిమా ఉంటుందంటున్నాడు ఈ దర్శకుడు. నాగచైతన్య, మహేష్ కు ఒకే కథ చెప్పాడంటూ వచ్చిన విమర్శల్ని కూడా ఈ సందర్భంగా ఖండించాడు.

First Published:  30 April 2020 8:00 AM GMT
Next Story