Telugu Global
Cinema & Entertainment

ఆ కథ బాలయ్య కోసమేనా?

లాక్ డౌన్ టైమ్ లో నటీనటులు ఫ్రీగా ఉండొచ్చేమో కానీ.. టెక్నీషియన్స్ మాత్రం ఖాళీగా లేవు. తమ బుర్రకు పదునుపెడుతూనే ఉన్నారు. మహేష్ బాబు కోసం కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నానంటూ ఇప్పటికే రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూరి జగన్నాధ్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఇంట్లో కూర్చొని ఓ పవర్ ఫుల్ మాస్ కథ రాస్తున్నాడు. తను కథ రాస్తున్న విషయాన్ని పూరి జగన్నాధ్ నిర్థారించాడు. అయితే ఆ కథ […]

ఆ కథ బాలయ్య కోసమేనా?
X

లాక్ డౌన్ టైమ్ లో నటీనటులు ఫ్రీగా ఉండొచ్చేమో కానీ.. టెక్నీషియన్స్ మాత్రం ఖాళీగా లేవు. తమ బుర్రకు పదునుపెడుతూనే ఉన్నారు. మహేష్ బాబు కోసం కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నానంటూ ఇప్పటికే రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూరి జగన్నాధ్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఇంట్లో కూర్చొని ఓ పవర్ ఫుల్ మాస్ కథ రాస్తున్నాడు.

తను కథ రాస్తున్న విషయాన్ని పూరి జగన్నాధ్ నిర్థారించాడు. అయితే ఆ కథ ఎవరి కోసం అనే విషయాన్ని మాత్రం అతడు వెల్లడించలేదు.

తాజా సమాచారం ప్రకారం బాలయ్య కోసమే పూరి జగన్నాధ్ ఆ కథ రాస్తున్నాడట. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో పైసా వసూల్ అనే సినిమా వచ్చింది. ఆ టైమ్ లోనే పూరితో మరో సినిమా చేస్తానని బాలయ్య ప్రకటించారు. అటు పూరి కూడా వీలైనంత తొందరగా బాలయ్యతో సినిమా చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడా కాంబో మరోసారి సెట్స్ పైకి రాబోతోందన్నమాట. ఎందుకంటే.. బాలయ్య మినహా పూరి చేతిలో ప్రస్తుతం మరో హీరో లేడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయి, థియేటర్లలోకి వచ్చిన వెంటనే బాలయ్యతో సినిమా పట్టాలపైకి వస్తుంది. ఈ గ్యాప్ లో బోయపాటితో సినిమాను పూర్తిచేయబోతున్నాడు బాలయ్య.

First Published:  22 April 2020 9:39 PM GMT
Next Story