Telugu Global
National

వరుస ప్రశ్నలు... ఆలోచనలో పడ్డ కన్నా !

చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడు పోయావా? లేదా?… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంధించిన ప్రశ్న. దీనికి సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పాల్సిన కన్నా…. ఎదురుదాడినే ఎంచుకున్నాడు. విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధం కావాలని సోమవారం కన్నా సవాల్‌ విసిరాడు…. దీనికి విజయసాయిరెడ్డి రెడీ అనగానే లాక్‌డౌన్‌ అయిపోయిన తర్వాత వస్తా అంటూ కన్నా వెనకడుగు వేశాడు. 20 కోట్ల రూపాయల సంగతి చెప్పకుండా… కిట్లు, […]

వరుస ప్రశ్నలు... ఆలోచనలో పడ్డ కన్నా !
X

చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడు పోయావా? లేదా?… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంధించిన ప్రశ్న. దీనికి సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పాల్సిన కన్నా…. ఎదురుదాడినే ఎంచుకున్నాడు.

విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధం కావాలని సోమవారం కన్నా సవాల్‌ విసిరాడు…. దీనికి విజయసాయిరెడ్డి రెడీ అనగానే లాక్‌డౌన్‌ అయిపోయిన తర్వాత వస్తా అంటూ కన్నా వెనకడుగు వేశాడు.

20 కోట్ల రూపాయల సంగతి చెప్పకుండా… కిట్లు, వాటిలో అవినీతి అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్నికల తర్వాత రామోజీరావును ఎందుకు కలిశావు? అక్కడ ఏం డీల్‌ కుదిరింది? అనేది మరో పెద్ద ప్రశ్న. గుంటూరు టీడీపీ ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్ట్‌ను కన్నా లక్ష్మీనారాయణ చదివి వినిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బ్యాంకుల నుంచి సుజనా చౌదరి 5,700 కోట్లు లూటీ చేశాడని…. వడ్డీతో కలిపి ఆ మొత్తం 10వేల కోట్లకు చేరిందని…. బిజెపిలో కోవర్టు పనులు చేస్తూ, బాబు బానిసల పేమెంట్స్ సుజనా చూస్తున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. తిరిగే కారు, వేసుకున్న బట్టలు, తినే తిండి అంతా బ్యాంకుల్లో ప్రజలు పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్నవే కదా సుజనా చౌదరి? అని ప్రశ్నించారు.

రాజ్యసభ సీటుకు వంద కోట్లు, ‘సున్నా’కు పేమెంటు చేసిన 20 కోట్లు, ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేసిన వెయ్యి కోట్లు, ఇన్ సైడర్ ట్రేడింగులో 500 ఎకరాలు కొన్నది బ్యాంకుల డబ్బుతోనే కదా… పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటనలు వస్తున్నా బేఫికర్ గా ఉన్నావంటే నీది మామూలు ‘గుండె’ కాదు సుజనా అంటూ విజయసాయి ఘాటుగా ట్వీట్‌ చేశారు.

First Published:  21 April 2020 9:19 PM GMT
Next Story