Telugu Global
Cinema & Entertainment

లావణ్య త్రిపాఠి ఏం చేస్తోందో తెలుసా?

ఈ లాక్ డౌన్ టైమ్ లో నటీనటులంతా ఇళ్లకే పరిమితమైన వేళ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఇంటికే అతుక్కుపోవాల్సి వచ్చింది. అయితే తనకు బోర్ కొట్టలేదంటోంది ఈ బ్యూటీ. ఈ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నాని, పుస్తకాలు బాగా చదువుతున్నానని చెప్పుకొచ్చింది. “క్వారంటైన్ నాకు కొత్త కాదు. టైమ్ దొరికితే ఇంట్లో అతుక్కుపోతాను. ఈసారి లాక్ డౌన్ టైమ్ లో కూడా అదే చేస్తున్నాను. కాకపోతే మొన్నటివరకు ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తూ, సోషల్ మీడియాలో […]

లావణ్య త్రిపాఠి ఏం చేస్తోందో తెలుసా?
X

ఈ లాక్ డౌన్ టైమ్ లో నటీనటులంతా ఇళ్లకే పరిమితమైన వేళ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఇంటికే అతుక్కుపోవాల్సి వచ్చింది. అయితే తనకు బోర్ కొట్టలేదంటోంది ఈ బ్యూటీ. ఈ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నాని, పుస్తకాలు బాగా చదువుతున్నానని చెప్పుకొచ్చింది.

“క్వారంటైన్ నాకు కొత్త కాదు. టైమ్ దొరికితే ఇంట్లో అతుక్కుపోతాను. ఈసారి లాక్ డౌన్ టైమ్ లో కూడా అదే చేస్తున్నాను. కాకపోతే మొన్నటివరకు ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తూ, సోషల్ మీడియాలో ఉంటూ ఆడుతూపాడుతూ గడిపేశాను. ఇప్పుడు సోషల్ మీడియాను కూడా పక్కనపెట్టేశాను. పూర్తిగా పుస్తకాలకు అంకితమైపోయాను. ఓపిక ఉన్నంతసేపు పుస్తకాలు చదువుతున్నాను. లేకపోతే నచ్చిన స్టఫ్ చూస్తున్నాను.”

సినీకార్మికుల సంక్షేమం కోసం టాలీవుడ్ నుంచి విరాళం ఇచ్చిన మొట్టమొదటి హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ప్రతి ఒక్కరు ఇలా కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించాలంటున్న లావణ్య.. ఈ లాక్ డౌన్ టైమ్ లో అమ్మా-నాన్నతో కలిసుంటే చాలా బాగుంటుందని అంటోంది.

“నాకు ఎప్పుడైనా నా అమ్మానాన్నతో కలిసి ఉండడం ఇష్టం. ఈ లాక్ డౌన్ లో వాళ్లు కూడా నా పక్కనుంటే బాగుండేది. కానీ నేను హైదరాబాద్ లో, వాళ్లు డెహ్రాడూన్ లో. రోజూ ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఈ ఖాళీ టైమ్ లో ఎక్కువగా వంట చేస్తున్నాను. పుస్తకాలు చదువుతున్నాను. ఎప్పట్నుంచో చూడాలనుకుంటున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు పూర్తిచేస్తున్నాను.”

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సందీప్ కిషన్ హీరోగా ఎ-1 ఎక్స్ ప్రెస్ అనే సినిమా చేస్తోంది. దీంతో పాటు త్వరలోనే వెబ్ సిరీస్ కూడా చేస్తానని ప్రకటించింది లావణ్య.

First Published:  20 April 2020 9:00 AM GMT
Next Story