Telugu Global
NEWS

టీడీపీకి షాకిచ్చిన బాలయ్య బెస్ట్ ఫ్రెండ్

ఏపీలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీ మారుతుండటంతో టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ వైసీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలయ్యకు ప్రాణస్నేహితుడైన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరాలని అనుకుంటున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే తన […]

టీడీపీకి షాకిచ్చిన బాలయ్య బెస్ట్ ఫ్రెండ్
X

ఏపీలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీ మారుతుండటంతో టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ వైసీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బాలయ్యకు ప్రాణస్నేహితుడైన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరాలని అనుకుంటున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన బాబూరావు.. తన మనసులోని మాట చెప్పేశారు. పార్టీని వీడక తప్పడం లేదని.. ఇక్కడ సరైన ఆదరణ లేదు కాబట్టి వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులతో బాబూరావు చెప్పారట.

బాబూరావు పార్టీ మారే విషయం, జగన్‌ను కలవబోయే విషయం వాట్సప్ గ్రూపులలో హల్ చల్ చేస్తోంది. రెండు, మూడు నెలల క్రితమే పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పుడు బాబూరావు ఆ విషయాన్ని కొట్టి పారేశారు. తాను ఎప్పటికీ బాలయ్య వెంటే ఉంటానని.. ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. కానీ తీరా ఇప్పుడు కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన టీడీపీకి, బాలయ్యకు హ్యాండ్ ఇవ్వబోతున్నారట.

కదిరి బాబూరావు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓడిపోయారు. వాస్తవానికి బాబూరావు కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నా.. దర్శి టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచే ఆయన అసంతృప్తితో ఉన్నారు.

First Published:  9 March 2020 11:40 PM GMT
Next Story