Telugu Global
NEWS

వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు సమన్లు

2012 ఉప ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీ చేసింది. ఈనెల 10న కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. వీరితో పాటు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ అయ్యాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండా రోడ్డుపై సభ నిర్వహించారంటూ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పోలీసులు వైఎస్ విజయమ్మ, షర్మిల, కొండా సురేఖ, కొండా మురళిపై కేసు నమోదు చేశారు. […]

వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు సమన్లు
X

2012 ఉప ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీ చేసింది. ఈనెల 10న కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. వీరితో పాటు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ అయ్యాయి.

ముందస్తు అనుమతి తీసుకోకుండా రోడ్డుపై సభ నిర్వహించారంటూ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పోలీసులు వైఎస్ విజయమ్మ, షర్మిల, కొండా సురేఖ, కొండా మురళిపై కేసు నమోదు చేశారు. 2012 పరకాల ఉప ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదు అయింది.

First Published:  6 Jan 2020 11:34 PM GMT
Next Story