Telugu Global
NEWS

వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పై దాడి

ప్రభుత్వ విప్, వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై దాడి జరిగింది. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఆయన కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో వాహనాలను ధ్వంసం చేశారు. అమరావతిలోనే అన్ని ఉండాలంటూ ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలు హైవేలపై ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కాజా టోల్‌ప్లాజా వద్ద వాహనాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రావడంతో ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు. వైసీపీ ఎమ్మెల్యే వచ్చాడు… […]

వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పై దాడి
X

ప్రభుత్వ విప్, వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై దాడి జరిగింది. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఆయన కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో వాహనాలను ధ్వంసం చేశారు. అమరావతిలోనే అన్ని ఉండాలంటూ ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలు హైవేలపై ఆందోళనకు దిగారు.

ఈ సమయంలో కాజా టోల్‌ప్లాజా వద్ద వాహనాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రావడంతో ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టారు. వైసీపీ ఎమ్మెల్యే వచ్చాడు… దాడి చేద్దామంటూ కేకలు వేస్తూ 40 మంది ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.

రామకృష్ణారెడ్డి సెక్యూరిటీపైనా దాడి చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని ఈడ్చుకెళ్లారు. టీడీపీ ఆందోళన నేపథ్యంలో సమీపంలోనే ఉన్న పోలీసులు అప్రమత్తమవడంతో అతికష్టమీద ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

First Published:  7 Jan 2020 3:31 AM GMT
Next Story