Telugu Global
NEWS

మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020

ముంబై వాంఖెడీ వేదికగా ప్రారంభమ్యాచ్ ప్రపంచ టీ-20 లోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ లీగ్ 2020 సీజన్ తొలిమ్యాచ్ కు ముంబై వాంఖెడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు మార్చి 29న ప్రారంభంకానున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తో సహా మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు పలుమార్పులు చేర్పులతో కూడిన జట్లతో టైటిల్ వేటకు దిగనున్నాయి. కోల్ కతాలో ఇటీవలే ముగిసిన వేలంలో తమ జట్టు అవసరాలకు తగిన ఆటగాళ్లను […]

మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020
X
  • ముంబై వాంఖెడీ వేదికగా ప్రారంభమ్యాచ్

ప్రపంచ టీ-20 లోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ లీగ్ 2020 సీజన్ తొలిమ్యాచ్ కు ముంబై వాంఖెడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు మార్చి 29న ప్రారంభంకానున్నాయి.

డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తో సహా మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు పలుమార్పులు చేర్పులతో కూడిన జట్లతో టైటిల్ వేటకు దిగనున్నాయి.

కోల్ కతాలో ఇటీవలే ముగిసిన వేలంలో తమ జట్టు అవసరాలకు తగిన ఆటగాళ్లను దక్కించుకోడం ద్వారా వివిధ ఫ్రాంచైజీలు తమతమ తుదిజట్లకు రూపకల్పన చేసుకోగలిగాయి.

మార్చి 29న వాంఖెడీ స్టేడియం వేదికగా చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు సీజన్లో తన ప్రారంభమ్యాచ్ ఆడనుంది.

మరోవైపు..మార్చి 29నే సీజన్ ప్రారంభం కావడంతో ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ దేశాలకు చెందిన పలువురు స్టార్ ప్లేయర్లు లేకుండానే ప్రారంభ రౌండ్ మ్యాచ్ లు ఆడాల్సి వస్తోందని ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లు లబోదిబో అంటున్నాయి.

ఏడువారాలపాటు సాగే 60 మ్యాచ్ ల లీగ్ ను దేశంలోని వివిధ ఫ్రాంచైజీలకు చెందిన పది క్రికెట్ వేదికల్లో నిర్వహించనున్నారు.

First Published:  31 Dec 2019 12:15 AM GMT
Next Story